కార్ యజమాని కావాలంటే తక్కువలో తక్కువ మూడు లక్షలైనా వెచ్చించాలిసిందే.. అది నిన్నటి సంగతి.. హ్యాచ్ బ్యాక్లు.. సెడాన్ లు.. ఎస్యూవిలు.. కార్లంటే గుర్తుకొచ్చే సెగ్మెంట్లో జాబితాలోకి కొత్త ఒకటి పుట్టుకొచ్చింది అదే క్వాడ్రిసైకిల్.. తక్కువ ధరలో కారు సొంతం చేసుకోవాలంటే అందుబాటులో ఉండేవి హ్యాచ్ బ్యాక్లు, కాస్త విశాలంగా ఉంటు కొంచెం ధర ఎక్కువ సెడాన్లు, ధర ఎక్కువైనా పర్వాలేదు నూతన ఫీచర్లు, సేఫ్టీ ఫీచర్లు కావాలనుకునే వారికీ ఎస్యూవిలు. సామాన్యుడికి అందుబాటులో క్వాడ్రిసైకిల్ సెగ్మెంట్ తో బుల్లికార్ల శకం రాబోతుంది.. సైజు తో పాటు ధర కూడా తక్కువే.. తాగాజా భారత మార్కెట్లో మహీంద్రా ఓ సరికొత్త అటామ్ క్వాడ్రిసైకిల్ విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది.. ఈ క్వాడ్రిసైకిల్ కోసం కంపెనీ చివరి దశ పరీక్షలను రోడ్లపై విస్తృతంగా నిర్వహిస్తోంది.. పూర్తి వివరాలు..
మహీంద్రా అటమ్ ఎలక్ట్రిక్ క్వాడ్రిసైకిల్ దేశంలో పెరుగుతున్న రైడ్ హెయిలింగ్ సేవల అవసరాలను తీర్చనుంది. ఇంకా త్రీ వీలర్ లకు ప్రత్యామ్నాయంగా ఇది రానుంది. దీనిని మెరుగైన భద్రత, వాతావరణ రక్షణను కలిగి ఉంది. దీని వేగాన్ని గంటకు 70 కిలోమీటర్లు పరిమితం చేసే అవకాశం ఉంది. ఇందులో 15 కిలో వాట్ల కంటే తక్కువ విద్యుత్ ఉత్పత్తి చేసే పవర్ యూనిట్ ఉందని అంచనా.
దీని క్యాబినెట్ లోపల స్పేర్ వీల్ ను విడిగా అమర్చారు. ఎయిర్ కండిషన్ వెన్స్ వెంట్స్బా, ఫ్లాట్ బాటమ్ టన్ టైప్ స్టీరింగ్ వీల్, బేస్ స్పెక్ వేరియంట్ కానుంది. 12 వోల్ట్ సాకెట్ డాష్ బోర్డు లో ఉంచిన రోటరీ గేర్ డయల్ ,పెద్ద స్క్రీన్ డిస్ప్లే సిస్టం ఉంది. దీనిని కంపెనీ యొక్క బెంగళూర్ ప్లాంట్లో అసెంబ్లింగ్ చేయనున్నారు. ఇది బజాజ్ నుండి రాబోయే క్యూట్ ఎలక్ట్రిక్ క్వాడ్రిసైకిల్ కు పోటీగా నిలువనుంది.