పట్టణం నందు ఆటోలు తిరుగుట కు సంబంధించి కొన్ని నిబంధనలు ఉన్నాయి.ఆటోడ్రైవర్ తప్పనిసరిగా మాస్కు ధరించాలి శానిటైజర్ కలిగి ఉండాలి.అదేవిధంగా ఆటో నందు ఒకరికన్నా ఎక్కువ మందిని ఎక్కించుకుని వెళ్ళరాదు. ఒకే కుటుంబానికి చెందిన సభ్యులు అయి ఉంటే ఇద్దరి వరకు ఎక్కించుకో వచ్చును.
ఆటోలని చాలా మంది పుష్పక విమానాలతో పోలుస్తూ ఉంటారు. ఎందుకంటే డ్రైవర్ లు జనాన్ని అలా ఎక్కిస్తూ ఉంటారు. ఒక్కో సారి అలా ఓవర్ లోడింగ్ వలన ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. తాజాగా అలానే జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో ఓ ఆటో పందిని ఢీకొట్టి బోల్తాపడింది. ధరూరు మండలం యములోనిపల్లి గ్రామం నుంచి కూలీలతో వస్తున్న వ్యవసాయ మార్కెట్ యార్డు దగ్గర పందిని ఢీకొని బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. మరో ఐదుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. గద్వాల పట్టణం రైల్వే స్టేషన్ సమీపంలో ఆటోలో డ్రైవర్ 20 మంది కూలీలను ఎక్కించుకున్నాడు. అనుకోకుండా పంది అడ్డం రావడంతో సడన్ బ్రేక్ వేశాడు. దీంతో ఆటో అదుపు తప్పి బోల్తా పడింది. ఓ మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. క్షతగాత్రులను స్థానిక ఏరియాసుపత్రికి తరలించారు.
ఆటో డ్రైవర్ లకు హెచ్చరికలు జారీచేసిన ,జరిమానా విధించిన కానీ మారడం లేదు.పట్టణ చివర్లలో ఎక్కువమంది ప్రయాణికులను ఎక్కించి ప్రాణాలతో చలగాటమాడుతున్నారు. ఇప్పటికైన ఆటో డ్రైవర్ లు తమ మరియు ప్రయాణికుల భద్రత గమనించాలని విజ్ఞప్తి