అమరావతి: రానున్న అయిదేళ్లలో అవినీతి రహిత రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలిచిపోవాలని వైసిపి పారిశ్రామికవేత్త పొట్లూరి వరప్రసాద్ అన్నారు. జగన్మోహనరెడ్డి అధికారంలోకి వచ్చిన ఆరు నెలల కాలంలోనే అవినీతి ర్యాంకింగ్లో ఒకట స్థానం నుండి 13వ స్థానానికి దించారని దించారని ఆయన పేర్కొన్నారు.
దేశంలో ఘన కీర్తి సంపాదించి, అవినీతిలో నెంబర్ ఒన్ ర్యాంగ్ సంపాదించిన పాత ప్రభువులకు సలాం అని ఆయన వ్యాఖ్యానించారు. వచ్చే అయిదేళ్లలో రాష్ట్రం 28వ ర్యాంకుకు వచ్చి కరెప్షన్ ఫ్రీ స్టేట్గా నిలిచిపోవాలని.. జై ఆంధ్రా అంటూ ట్వీట్ చేశారు.
‘ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ ఇండియా’ సంస్థ నిర్వహించిన ‘ఇండియా కరప్షన్ సర్వే 2019’లో ఆంధ్రప్రదేశ్ 13వ స్థానంలో ఉన్నట్లుగా పేర్కొన్నది. తెలంగాణ రాష్ట్రం అయిదవ స్థానంలో ఉంది. ఈ సర్వే రిపోర్టుపై పివిపి ట్విట్టర్ వేదికగా స్పందించి పై వ్యాఖ్యలు చేశారు.
దేశంలో ఘన కీర్తి సంపాదించి, అవినీతిలో నెంబర్ 1 ర్యాంక్ సంపాదించిన పాత ప్రభువులకు సలాం.
ఒకటి నుండి 13కు గట్టిగా ఆరు నెలలలోనే దించారు. వచ్చే 5 ఏళ్లలో 28వ ర్యాంకు కి వచ్చి, Corruption Free State గా నిలిచిపోవాలి..
జై ఆంధ్రాhttps://t.co/xu5eNyFQq9— PVP (@PrasadVPotluri) November 30, 2019