YS Sharmila Party : వైయస్ షర్మిల కొత్త పార్టీ YS Sharmila Party విషయంలో ఆంధ్ర ముద్ర పడకుండా… ఆలోచన చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో ఎన్నికల కమిషన్ దగ్గర “వైయస్సార్ టి” పేరు లేదా “రాజన్న రాజ్యం” అనే పేరు రిజిస్టర్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక జెండా అజెండా విషయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్ పార్టీ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు.. వైఎస్ఆర్ హయాంలో అమలైన కొన్ని కార్యక్రమాలను రెండిటిలో మంచివి తీసుకుని.. ప్రధాన అజెండాగా పార్టీ రూపకల్పనకు షర్మిల టీం రెడీ చేస్తున్నట్లు సమాచారం. తెలంగాణ ప్రజా అభిప్రాయం మేరకు ప్రస్తుతం అన్ని జిల్లాలలో నాయకులతో మరియు మద్దతుదారులతో జరగబోయే చర్చల విషయంలో… షర్మిల కీలక నిర్ణయాలు తీసుకోవటం జరుగుతుందని, తద్వారా మరింతగా పార్టీ విధి విధానాలు రూపొందించడానికి సన్నాహాలు చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి.
ఇదే తరుణంలో నీళ్లు, నిధులు ఇంకా అనేక విషయాలలో ఎక్కడా కూడా రాజీపడే ప్రసక్తి లేదని అవసరమైతే ఆంధ్ర తో కూడా తలపడటానికి ఈ కొత్త పార్టీ విధి విధానాలు ఉండేవిధంగా షర్మిల నిర్ణయాలు తీసుకోబోతున్నట్లు సన్నిహితుల నుంచి అందుతున్న సమాచారం. తెలంగాణలో కచ్చితంగా రాజన్న రాజ్యం తీసుకురావటానికి షర్మిల తన ఆలోచన మేరకు..తన సొంత నిర్ణయంతో ఈ కొత్త పార్టీ రూపకల్పనకు శ్రీకారం చుట్టినట్లు టాక్. కొత్త పార్టీ విషయంలో ఏపీ లో ఉన్న వైసిపి పార్టీ నేతలు చాలామంది వద్దని చెప్పినా గాని.. షర్మిల తన సొంత నిర్ణయంతో తెలంగాణ రాజకీయాల్లో అడుగుపెట్టడానికి రెడీ అయినట్లు వార్తలు వస్తున్నాయి.