హైదరాబాద్: మాజీ ఎంపీ, మాజీ మంత్రి వైఎస్ వివేకానంద మరణంపై ఆయన కుమార్తె సునీతా రెడ్డి హైదరాబాద్ పోలీసులను ఆశ్రయించారు. తన తండ్రి మరణంపై సోషల్ మీడియాలో కొంత మంది అసత్యాలు ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. ఈ మేరకు సైబరాబాద్ సిపి సజ్జనర్కు ఆమె ఫిర్యాదు చేశారు.
ఆమె శనివారం తన భర్త రాజశేఖరరెడ్డితో కలిసి సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్కు వచ్చారు. తన తండ్రి మృతిపై అవాస్తవాలు వ్యాప్తి చేస్తున్న నిందితులను చట్టప్రకారం శిక్షించాలని సునీతారెడ్డి తన ఫిర్యాదులో కోరారు.
కొందరు వ్యక్తులు ఉద్దేశపూర్వకంగా తప్పుడు కథనాలు రాసి సోషల్ మీడియాలో పెడుతున్నారని ఆరోపించారు. ఫేస్ బుక్, వాట్సాప్, యూట్యూబ్, ట్విట్టర్ లో ఈ దుష్ప్రచారానికి పాల్పడుతున్నారని తెలిపారు.