కడప:పరిపాలన., ప్రజా సంక్షేమం విషయంలో వైఎస్ రాజశేఖరరెడ్డి నిర్ణయాలు దేశం మొత్తానికి మార్గద్శకంగా నిలిచాయని ఆయన తనయుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ప్రశంసించారు. దివంగత సిఎం రాజశేఖరరెడ్డి10 వర్ధంతిని పురస్కరించుకొని సోమవారం కుటుంబసభ్యులు, పార్టీ నేతలతో కలిసి ఇడుపులపాయలో ఘాట్ వద్ద నివాళులర్పించారు. అనంతరం పులివెందులలో దివంగత మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించారు.
రాష్ట్రాన్ని వైఎస్ నడిపించిన తీరు జాతీయ స్థాయిలో తెలుగు ప్రజలను ఎంతో గర్వించేలా చేసిందని వ్యాఖ్యానించారు. ‘నాన్న భౌతికంగా దూరమైనా పథకాలరూపంలో భ్రతికే ఉన్నారు’ అని జగన్ పేర్కొన్నారు. ఆయన ఇచ్చిన స్పూర్తి మనల్ని ఎప్పటికీ విలువల భాటలో నడిపిస్తూనే ఉంటుందని జగన్ అన్నారు.