మహారాష్ట్రలో కరోనా వైరస్ డేంజర్ బెల్స్ మోగిస్తున్న విషయం అందరికి తెలిసిందే. రోజురోజుకి కరోనా పాజిటివ్ కేసులు రికార్డు స్థాయిలో అన్ని రాష్ట్రాల్లో కంటే మహారాష్ట్ర లోనే ముందు నుండి నమోదవుతున్నాయి. అయినా కానీ ప్రభుత్వాలు ఏ మాత్రం కంట్రోల్ చేయలేని పరిస్థితి. దేశం మొత్తం మీద నమోదవుతున్న కేసులలో దాదాపూ నమోదైన 40 శాతం కేసులు మహారాష్ట్ర లోనివే. స్వయంగా కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి ఇచ్చిన స్టేట్ మెంట్. అది కూడా లాక్ డౌన్ సమయంలో. ఆ తర్వాత కేంద్రం లాక్ డౌన్ ఎత్తి వేసిన కూడా రాష్ట్రంలో పరిస్థితి ఏమాత్రం అదుపులోకి రాలేదు.
ఇదిలా ఉండగా ప్రస్తుతం పరిస్థితి మరింత దారుణంగా మారిపోయింది. శనివారం ఒక్కరోజే మహారాష్ట్రలో దాదాపు 9251 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. దీంతో మహారాష్ట్రలో మొత్తం కేసుల సంఖ్య 3,66,368కి చేరింది. వీటిలో కరోనా నుంచి కోలుకుని 2,07,194 మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా యాక్టివ్ గా ఉన్న కేసుల సంఖ్య 1,45,481.
ఈ విషయాన్ని మహారాష్ట్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. అంతేకాకుండా గడిచిన 24 గంటల్లో 257 మంది రాష్ట్రంలో చనిపోయినట్లు పేర్కొన్నారు. ముఖ్యంగా రాష్ట్రంలో దేశ ఆర్థిక రాజధాని ముంబై నగరంలో కరోనా తీవ్రత ఎక్కువగా ఉండటంతో కేంద్రం ఎలాగైనా ముంబైలో పరిస్థితిని అదుపులోకి తీసుకు రావాలని ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే పలు సార్లు ముంబాయిలో లాక్ డౌన్ విధించడం జరిగింది.