మధురై (తమిళనాడు), జనవరి 27: తమిళనాడు రాష్ట్రంలో ప్రధాని నరేంద్ర మోదికి చేదు అనుభవం ఎదురైంది. మధురై సమీపంలో తోవ్వూరు వద్ద ఈ ఘటన శనివారం జరిగింది. ఇక్కడ 1264కోట్లతో నిర్మిస్తున్న ఎయిమ్స్ ఆసుపత్రికి ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంలో ఎండిఎంకె చీఫ్ వైకో ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. గోబ్యాక్ మోది అంటూ నినాదాలు చేశారు.
తమిళనాడులో ఇటీవల సంభవించిన గజ తుఫానుకు మూడు లక్షల మంది నిరాశ్రయులు అయ్యారని గుర్తు చేశారు. బాధితులకు సాయం చేయకుండా, వారిని పరామర్శించడానికి రాకుండా నేడు ప్రారంభోత్సవానికి రావడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.
పోలీసు సిబ్బంది ఆందోళనకారులను నిలువరించారు.
శంకుస్థాపన కార్యక్రమంలో ప్రధాని మోది వెంట ముఖ్యమంత్రి పళని స్వామి, ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, రాధాకృష్ణన్, రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.