విదేశాల్లో దాగి ఉన్న నల్లధనాన్ని తీసుకువచ్చి దేశంలో పేద వాళ్లకి పంచుతాను అంటూ మోడీ ప్రధాని అభ్యర్థిగా 2014 ఎన్నికల టైంలో బరిలోకి దిగారు. ఆ టైంలో సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో మోడీ ఎన్నికల ప్రచారం చేశారు. గుజరాత్ రాష్ట్రానికి మూడు దఫాలుగా ముఖ్యమంత్రిగా కొనసాగిన మోడీ నాయకత్వంలో దేశం అభివృద్ధి చెందటం గ్యారెంటీ అని అందరూ భావించి అధికారాన్ని కట్టబెట్టారు. ఆ తరువాత నల్ల ధనం విషయంలో ప్రతిపక్షాల నుంచి విమర్శలు వస్తున్న తరుణంలో ఒక్క సారిగా నోట్ల మార్పిడి అని నిర్ణయం తీసుకుని అందరికీ షాక్ ఇచ్చారు.
మోడీ తీసుకున్న ఈ నిర్ణయం అనవసర డెసిషన్ అని తర్వాత పరిణామాలు బట్టి విమర్శలు ప్రజల నుండి ప్రతిపక్షాల నుండి వచ్చాయి. ప్రభుత్వాన్ని కేంద్రంలో సుస్థిరం చేసుకున్నారు. కానీ గతంలో లాగా కాకుండా ప్రస్తుతం మోడీపై తీవ్రస్థాయిలో ప్రజలలో ఉన్న కొద్ది వ్యతిరేకత పెరుగుతున్నట్లు జాతీయ రాజకీయాల్లో వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా కరోనా కట్టడి విషయంలో మోడీ వ్యూహాత్మకమైన తీసుకునే నిర్ణయాలు ప్రజాగ్రహానికి కారణమవుతున్నట్లు టాక్ నడుస్తోంది.
ప్రతిష్టాత్మకంగా తీసుకున్న వ్యవసాయ సంస్కరణలు బిల్లు, విద్యుత్ సంస్కరణల బిల్లులో చాలా వివాదాస్పదం కావడంతో మోడీ పేరు చెబితేనే ఇప్పుడు దేశవ్యాప్తంగా ఉన్న రైతులు మండిపడే పరిస్థితి నెలకొన్నట్లు టాక్ వస్తోంది. మరోపక్క కరోనా కారణంగా దేశంలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేని సమయంలో పెట్రోల్, డీజిల్ ధరలు పెంచడం కూడా మోడీ సర్కార్ పై తీవ్రంగా ప్రజాగ్రహం నెలకొన్నట్లు పరిశీలకుల మాట. ముఖ్యంగా సోషల్ మీడియాలో మోడీకి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ప్రచారం మొదలైందని, ఇందువల్లే ఇటీవల ఎన్డీఏలో మిత్రపక్షాలుగా ఉన్న పార్టీలు మెల్లగా ఒక్కొక్కటి దూరమవుతున్నట్లు పరిశీలికుల మాట. దీంతో వచ్చే సార్వత్రిక ఎన్నికల నాటికీ బీజేపీ ప్రభుత్వానికి ఎదురు దెబ్బలు తగలటం గ్యారెంటీ అనే టాక్ జాతీయ స్థాయిలో వినబడుతోంది.