కరోనా కారణంగా చిన్న సినిమాల దగ్గర్నుంచి భారీ నడ్జెట్ సినిమాల వరకు అన్ని షూటింగ్స్ ఆపేసి ఇన్నాళ్ళు ఖాళీగా కూర్చున్నారు. భారీ స్థాయిలో విదేశాలలో షూటింగ్ షెడ్యూల్స్ ప్లాన్ చేసుకున్న ప్రభాస్ రాధే శ్యాం, పూరి – విజయ్ దేవరకొండ ఫైటర్, సుకుమార్ – అల్లు అర్జున్ ల పుష్ప లాంటి పాన్ ఇండియన్ సినిమాల ప్లాన్ అన్నీ తారుమారయ్యాయి. పక్కాగా ప్లాన్స్ వేసుకొని షూటింగ్ చేసుకోవాలని భావించి విదేశాలకి వెళ్ళి ఇండియాకి తిరిగొచ్చేశారు.
అయితే ఇప్పుడు ఇండియా కంటే విదేశాలలోనే పరిస్థితులు అదుపులోకి వచ్చాయి. దీంతో ఒక్కో సినిమా షూటింగ్స్ ప్రారంభం కాబోతున్నాయి. మొన్నటి వరకూ విదేశాల్లో కరోనా విజృంభణ ఎక్కువ ఉండడంతో అక్కడ చాలా వరకూ షూటింగ్స్ జరిగిన సినిమాలు.. మిగతా షూటింగ్ ని హైదరాబాద్ స్టూడియోస్ లోనే సెట్స్ వేసి చిత్రీకరించాలని మేకర్స్ ప్లాన్ చేసుకున్నారు. కాని ఇక్కడికంటే ఇప్పుడు విదేశాల్లోనే కరోనా వ్యాప్తి చాలా తక్కువగా ఉందన్న కారణంగా.. మళ్ళీ విదేశాల్లోనే చిత్రీకరణ జరపాలని ప్లాన్ చేసుకుంటున్నారు. ఈ క్రమం లో ‘రాధే శ్యామ్’ టీం అందరికంటే ముందు విదేశాలకి బయలు దేరారు.
లాక్ డౌన్ కు ముందు ‘రాధే శ్యామ్’ షూటింగ్ ఇటలీలో చాలా వరకూ జరిపారు. కరోనా ప్రభావం వల్ల.. హైదరాబాద్ లో కొన్ని సెట్స్ వేసి.. ఇటలీకి మ్యాచ్ అయ్యే ఇండోర్ సీన్స్ కంప్లీట్ చేశారు. ఆ సీన్స్ లో ప్రభాస్, సీనియర్ బాలీవుడ్ నటి భాగ్యశ్రీ మీద కీలక సన్నివేశాలు పూర్తయ్యాయట. అయినా కొన్ని సీన్స్ బ్యాలెన్స్ ఉండటంతో ఒరిజినాలిటీ కోసం ‘రాధే శ్యామ్’ టీం మళ్ళీ ఇటలీ వెళ్ళారు. అందుకోసం 15 రోజుల షెడ్యూల్ ప్లాన్ చేసుకున్నారట. ఇందుకు సంబంధించిన ప్రభాస్ లేటెస్ట్ ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మొత్తానికి డార్లింగ్ రాధే శ్యామ్ కోసం పెద్ద ప్లానే వేశాడు. ఇక ఈ పిక్ చూసిన నార్త్ అమ్మాయిలకైతే నోట మాట రావడం లేదట.
Aavesham OTT: డిజిటల్ స్ట్రీమింగ్ డేట్ ను కన్ఫామ్ చేసుకున్న ఆవేశం మూవీ.. ఈ రూ. 150 కోట్ల మూవీ స్ట్రీమింగ్ ఎక్కడంటే..!