ఏపీ సీఎం వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన నాటి నుండి మద్యం విషయంలో చాలా కఠినంగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ప్రతిపక్షంలో ఉన్న సమయంలో పాదయాత్రలో అదేవిధంగా ఎన్నికల ప్రచారంలో రాష్ట్రంలో మద్యం నియంత్రణ దశలవారీగా అమలు చేస్తామని వైయస్ జగన్ ఇచ్చిన హామీ మేరకు ఆ రీతిలోనే వ్యవహరించారు. ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత గ్రామాలలో ఉండే బెల్టుషాపులను తొలగించిన వైయస్ జగన్ క్రమక్రమంగా మద్యం షాపులు తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఆ తర్వాత మద్యం షాపుల దగ్గర కూర్చుని తాగే విధానాన్ని మరియు మద్యం షాపుల సమయాన్ని కూడా తగ్గిస్తూ వచ్చారు.
దీంతో రాష్ట్రంలో ప్రభుత్వంపై మందు బాబు ల నుండి తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి. కానీ ఈ విషయంలో వైఎస్ జగన్ మాత్రం వెనకడుగు వేయకుండా ఇంకా కఠినంగానే ముందుకు సాగారు. ఇలాంటి తరుణంలో సరిహద్దుల రాష్ట్రాలనుండి చాలా వరకు అక్రమ మద్యం ఏరులై పారింది. చాలామంది బెల్ట్ బాంబు లాగా మద్యం బాటిల్స్ ను కొన్ని వందలను బండిలో చొక్కా లోనా చుట్టుకుని సరిహద్దుల నుండి తీసుకువస్తూ పోలీసులకు ఇటీవల చాలామంది చిక్కడం జరిగింది. ఇటువంటి తరుణంలో ఇటీవల ప్రభుత్వ అధికారులతో జగన్ అక్రమ మద్యం విషయంలో తీసుకున్న నిర్ణయాలు చర్చించి అభిప్రాయాలు కొన్ని మీడియా వర్గాలలో వైరల్ అవుతున్నాయి.
పూర్తి విషయంలోకి వెళితే రాష్ట్రంలో మద్య నియంత్రణ చేపడుతున్న ఇతర రాష్ట్రాల నుండి అక్రమ మద్యం ఏరులై పారుతోంది…. దీనివల్ల నిర్ణయం తీసుకున్న వ్యర్థమవుతుంది పైగా ఇతర రాష్ట్రాల ఆదాయాల మనం మద్దతు ఇచ్చినట్లు అయింది అని ప్రభుత్వ అధికారుల దగ్గర సీఎం వైఎస్ జగన్ నిరుత్సాహం చెందినట్లు టాక్ వస్తోంది.
ఇటువంటి తరుణంలో అక్రమ మద్యం విషయంలో కఠినంగా వ్యవహరించాలని సరికొత్త చట్టం తీసుకురాబోతున్నారు దొరికితే ఏకంగా ఐదు సంవత్సరాల జైలు శిక్ష విధించేలా వైసీపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకోబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ దెబ్బతో రాష్ట్ర సరిహద్దుల వద్ద అక్రమ మద్యం ఆగిపోతుందని, ఈ కొత్త చట్టం తో ఏపీలో ఆదాయం గ్యారెంటీగా పెరుగుతుంది అనే స్ట్రాటజీ తో ఒకపక్క మద్యాన్ని నిర్ములిస్తూనే మరోపక్క ఆదాయం పెంచుకునే రీతిలో ఏపీ ప్రభుత్వం రెడీ అయినట్లు సరికొత్త వార్తలు వస్తున్నాయి.