రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి జల వివాదం పై ఆగస్టు 25 వ తారీకు అపెక్స్ కౌన్సిల్ సమావేశం కేంద్ర జల శక్తి మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. వాస్తవానికి ఈ సమావేశం ఆగస్టు 5వ తారీఖున జరగాల్సి ఉండగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆ రోజు క్యాబినెట్ సమావేశం అంటూ తప్పించుకోవటం జరిగింది. దీంతో ఈనెల 25వ తేదీకి సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. కచ్చితంగా జరగబోయే సమావేశంలో ఏపీ ప్రభుత్వం కొత్త ప్రాజెక్టులు కడుతుంది… అన్న రీతిలో అన్ని ఆధారాలు సిద్ధం చేసుకుని కేసిఆర్ ఈ సమావేశానికి రెడీ అయ్యారట.
ఇంతలోనే కేంద్ర జలవనరుల శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ కి కరోనా పాజిటివ్ ఇటీవల రావడంతో ఆయన ఇప్పుడు చికిత్స కోసం హాస్పిటల్లో చేరారు. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల మధ్య వివాదానికి కారణమైన రాయలసీమ ఎత్తిపోతల పథకం పోతిరెడ్డి ప్రాజెక్టు విషయంలో ఏపీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాన్ని కడిగి పారేయాలని అనుకున్న కేసీఆర్ కి ఇది సూపర్ ఫ్లాప్ ఇచ్చినట్లయింది. చాలా వరకు సమావేశం వాయిదా పడినట్లే అని సమాచారం.
ప్రాజెక్టు పనులకు సంబంధించి ఏపీ ప్రభుత్వం టెండర్ ప్రక్రియ పిలవటం ఇంతలోనే కృష్ణా ట్రిబ్యునల్ బోర్డు….వెంటనే ఏపీ ప్రభుత్వం చేపడుతున్న టెండర్ల ప్రక్రియ ఆపేయాలని కోరడం జరిగింది. దీంతో జరగబోయే అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో ఏపీ ప్రభుత్వాన్ని నిలదీయాలని రెడీ అయిన కేసీఆర్ కి తాజా పరిణామం షాక్ ఇచ్చినట్లు అవ్వగా, వైయస్ జగన్ కి ఇది బంపర్ హిట్ అని అంటున్నారు. సరైన పాయింట్లతో నెక్స్ట్ జరగబోయే అపెక్స్ కౌన్సిల్ సమావేశానికి ఏపీ ప్రభుత్వం రెడీ అయితే విషయం పూర్తిగా మారిపోతుందని ప్రాజెక్టు నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు.
మరోపక్క కచ్చితంగా ఈ సమావేశం వాయిదా పడిందని, అందువల్లే మంగళవారం వైయస్ జగన్ తన పూర్తి సమయాన్ని కుటుంబ సభ్యులతో గడుపుతున్నట్లు టాక్. ఎందుకంటే ఇటీవల ప్రపంచంలోని టాప్ బిజినెస్ స్కూల్లో సీటు సంపాదించిన కూతురు ని పై చదువుల కోసం బెంగుళూరు విమానాశ్రయంలో డ్రాప్ చేయడానికి వెళ్తున్నట్లు ఏపీ ప్రభుత్వ వర్గాల నుండి వార్తలు వస్తున్నాయి.