మొన్న మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా అతని 152వ చిత్రం ‘ఆచార్య’ సినిమా మోషన్ పోస్టర్ ను విడుదల చేసిన విషయం తెలిసిందే. మెగా అభిమానులు అందరినీ అలరించిన ఆ మోషన్ పోస్టర్ తో సినిమా అంచనాలు తారాస్థాయికి పెరిగాయి. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ‘ధర్మస్థలి’ అనే ఊరు కోసం చిరంజీవి చేసిన పోరాటం ఎలా జరిగింది…. చివరికి ఎలా ముగిసింది అన్న కాన్సెప్ట్ తోనే ఈ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.
ఇప్పటికే చాలా వరకు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా కరోనా నేపథ్యంలో వాయిదాపడింది. కాజల్ అగర్వాల్ ఈ సినిమాకు హీరోయిన్ గా నటిస్తోంది అన్న వార్తలు వస్తున్నాయి. కానీ మోషన్ పోస్టర్ ద్వారా కూడా హీరోయిన్ ఎవరో అధికారికంగా ప్రకటించలేదు. ఈ సినిమాకు మణిశర్మ బాణీలు అందిస్తున్నాడు
ఈ సినిమా కథ ప్రకారం మనకు వచ్చిన సమాచారం ఏమిటంటే.. ఆలయాల విగ్రహాల చోరీ, దేవాలయ భూముల విషయమై జరుగుతున్న అక్రమాల నేపథ్యంలో సినిమా నడుస్తుందని తెలుస్తోంది. ఇక అంతటి కథాబలం ఉన్న చిత్రానికి కమర్షియల్ హంగులు జోడించి కొరటాల…. చిరంజీవి ఇమేజ్ కు సరిపడేలా సినిమాను తెరకెక్కిస్తున్నారు. సినిమా మెయిన్ ట్రాక్ తో పాటు చిరు కి సంబంధించి వచ్చే ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో కీ పాయింట్స్ ఉన్నాయ్ అని అంటున్నారు.
దాదాపు పదేళ్ల తర్వాత ఖైదీ సినిమాతో మళ్లీ ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిరు ఆ సినిమా రీమేక్ కావడంతో అందులో కొన్ని మసాలాలు మిస్సయ్యాయి. సైరా చారిత్రాత్మక నేపథ్యం ఉన్న కథాంశం కావడంతో అందులో కూడా చిరు మాస్ మసాలాలు దట్టించలేదు. అయితే ఈ ఆచార్య సినిమా మాత్రం మెగా ఫ్యాన్స్ కు ఆ లోటుని తీరుస్తుందని తెలుస్తోంది. మొత్తానికి సరికొత్త కథాంశంతో మంచి కమర్షియల్ హంగులు జోడించి ‘ఆచార్య’ సినిమా బ్లాక్ బస్టర్ అవుతుందన్న టాక్ ఇండస్ట్రీలో నడుస్తోంది.
Mogali Rekulu: మెగా ఫ్యామిలీతో సందడి చేసిన మొగలిరేకులు ఆర్కే నాయుడు.. వైరల్ అవుతున్న ఫొటోస్..!