టీడీపీ నేత, మాజీ మంత్రి కొల్లు రవీంద్రకు కృష్ణ జిల్లా కోర్టు ఈరోజు షరతులతో కూడిన బెయిల్ ను మంజూరు చేసింది.
వైసీపీ నేత మోకా భాస్కర రావును మచిలీపట్నం మార్కెట్ యార్డు వద్ద ఈ ఏడాది జూన్ 29వ తేదీన హత్య చేసిన విషయం తెల్సిందే.ఈ నేపథ్యంలో జూలై 4వ తేదీన మఫ్టీలో పోలీసులు కొల్లు రవీంద్రను అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయంపై అప్పట్లో నారా చంద్రబాబు నాయుడు వైసీపీ పార్టీపై విరుచుకుపడ్డారు.
కావాలనే టీడీపీ నేతలను టార్గెట్ చేస్తున్నారని, తప్పుడు కేసులు పెట్టి కక్ష సాధిస్తున్నారని విమర్శించారు. ఇక కొల్లు రవీంద్ర పెట్టుకున్న బెయిల్ పిటీషన్ పై ఈరోజు విచారణ జరుగగా లక్ష రూపాయల పూచికత్తుతో పాటు 14 షరతులతో కూడిన బెయిల్ ను కోర్టు ఈరోజు మంజూరు చేసింది.