గతంలో ప్రతిపక్షంలో ఉన్న సమయంలో వైసీపీని ఇబ్బందులపాలు చేసిన ప్రతి ఒక్కరిని జైలుపాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. చింతమనేని ప్రభాకర్, అచ్చెన్నాయుడు మరికొంతమంది నేతలు ప్రస్తుతం లైన్ లో ఉన్నారు. అమరావతి భూకుంభకోణం విషయంలో చాలా మంది టిడిపి పార్టీ నేతలు జైలుకు వెళ్లే పరిస్థితి ఉన్నట్లు వార్తలు ఇటీవల వస్తూ ఉన్నాయి. మరి ఇలాంటి తరుణంలో అందరూ అయిపోయారు ఏమో అని అనుకున్నారో తెలియదుగానీ వైసీపీ ఇప్పుడు పరిటాల ఫ్యామిలీ పై రివేంజ్ డ్రామా తీర్చుకోటానికి రంగం సిద్ధం చేసినట్లు వార్తలు వస్తున్నాయి. దీనిలో భాగంగా మాజీ మంత్రి పరిటాల సునీత సోదరుడు మురళిని ముందుగా వైసీపీ టార్గెట్ చేసినట్లు అనంతపురం జిల్లా రాజకీయాల్లో వార్తలు వైరల్ అవుతున్నాయి.
పూర్తి మేటర్ లోకి వెళ్తే అనంతపురం జిల్లాకు చెందిన చంద్రశేఖర్ అనే వ్యాపారి పరిటాల సునీత సోదరుడు మురళి దగ్గర కోటి రూపాయలు అప్పు తీసుకోవడం జరిగిందట. ఈ కోటి రూపాయలు అప్పు విషయంలో మధ్యవర్తిగా మురళి తన మామ వేలూరు రామాంజనేయులు పేరు మీద డాక్యుమెంట్ రాయించి రిజిస్టర్ చేసి అగ్రిమెంట్ రాయించుకొనినట్లు వ్యాపారి చంద్రశేఖర్ ఇటీవల తెలిపారు.
ఇదిలా ఉండగా ఈ అప్పు విషయంలో రెండు రూపాయల 75పైసలు వడ్డీ చెల్లించాలని పరిటాల సునీత సోదరుడు మురళి వేధించి డబ్బులు చెల్లించకపోవడంతో…. 10 కోట్లు రూపాయలు విలువ చేసే తన వ్యవసాయ భూములను మురళి అక్రమంగా రిజిస్టర్ చేయించుకున్నారని బాధితుడు చంద్రశేఖర్ ఇటీవల మీడియా ముందు తెలిపారు. అయితే బాధితుడు ఆరోపణలు చేసిన పరిటాల ఫ్యామిలీ గాని మురళి అనే వ్యక్తి గాని స్పందించలేదు. మరోపక్క అనంతపురం జిల్లాకు చెందిన టిడిపి క్యాడర్ ఇదంతా పరిటాల ఫ్యామిలీ పై రివెంజ్ డ్రామాకి ప్రభుత్వం ఆడుతున్న కుట్ర అని ఆరోపిస్తున్నారు.