Ys Sharmila : తెలంగాణ రాజకీయాలలో వైయస్ షర్మిల రాజకీయ ఎంట్రీ వాతావరణం సంచలనం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. తెలంగాణలో రాజన్న రాజ్యం తీసుకు వస్తాను అని, ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అంటూ మీడియా ముందు షర్మిల చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశం అవటంతో ..ఆమె ప్రస్తుతం వ్యవహరిస్తున్న తీరు రాజకీయంగా అనేక సంచలనాలకు దారి తీస్తుంది. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో అన్ని జిల్లాల వైయస్ మద్దతుదారులతో “ఆత్మీయ సమ్మేళనం” పేరట సమావేశమవుతున్నారు.
అదే రీతిలో తెలంగాణలో ప్రముఖులతో కూడా భేటీ అవుతున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే ఇతర పార్టీలకు చెందిన నాయకులు షర్మిల పార్టీలో జాయిన్ అవుతున్నట్లు స్పష్టం చేయడం జరిగింది. ఇలాంటి తరుణంలో లోటస్ పాండ్ లో షర్మిలతో తెలంగాణలో టాప్ మోస్ట్ క్రీడా నేపథ్యం కలిగిన ఫ్యామిలీ లు భేటీ అయ్యాయి. మేటర్ లోకి వెళ్తే హైదరాబాద్ నగరానికి చెందిన టెన్నిస్ స్టార్ సానియా మీర్జా సోదరి అనం మిర్జా అదేవిధంగా మాజీ క్రికెటర్ భారత క్రికెట్ కెప్టెన్ అజారుద్దీన్ కొడుకు అసదుద్దీన్ ఈరోజు షర్మిల తో భేటీ అయ్యారు. దీంతో ఈ వార్త తెలంగాణ రాజకీయాల్లో పెను దుమారాన్ని రేపుతోంది. మోటివేషనల్ స్పీకర్ షఫీ అదేవిధంగా సానియా మిర్జా సోదరి, అజారుద్దీన్ కొడుకు ఇలా చాలా మంది ప్రముఖులు షర్మిల తో భేటీ అవుతూ ఉండటంతో రాజకీయంగా ఆమె.. వేస్తున్న అడుగులు సంచలనాలకు తెర లేపుతున్నాయి.