అమరావతి : టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విశాఖ పర్యటనపై ఉత్కంఠత కొనసాగుతున్నది. కరోనా లాక్ డౌన్ కారణంగా రెండు నెలలకు పైగా చంద్రబాబు హైదరాబాద్ లోనే ఉండిపోయారు.
ఇప్పుడు అన్ని వైపులా కరోనా లాక్ డౌన్ ఆంక్షలు సడలించటం, అలాగే డొమెస్టిక్ ఎయిర్ లైన్స్ కు కూడా అనుమతి ఇవ్వటంతో, చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ రావటానికి నిర్ణయించుకున్నారు. ఇరు రాష్ట్రాలు అయిన ఆంధ్రప్రదేశ్, తెలంగాణా డీజీపీలకు అనుమతి కోరుతూ లేఖ రాశారు. అయితే తెలంగాణా డీజీపీ కార్యాలయం వెంటనే పర్మిషన్ ఇవ్వగా, ఇంకా ఆంధ్రప్రదేశ్ డీజీపీ కార్యాలయం నుంచి చంద్రబాబుకు అనుమతి రాలేదు. ఏపి పోలీసులు అనుమతి ఇస్తే చంద్రబాబు సోమవారం హైదరాబాద్ ఎయిర్ పోర్టు నుండి నేరుగా విశాఖ చేరుకొని, అక్కడ ఎల్జి పొలిమార్స్ గ్యాస్ లీక్ బాధితులను పరామర్శించి అక్కడ నుండి రోడ్డు మార్గంలో అమరావతికి రానున్నారు.
చంద్రబాబు పర్యటనకు సంబంధించి ఇప్పటి వరకు పోలీస్ వర్గాల నుండి అనుమతి రాకపోవడంతో ఆయన పర్యటనపై సర్వత్రా ఆసక్తి నెలకొన్నది.