ఇటీవల దేశంలో కొని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో జరిగిన వీడియో కాన్ఫరెన్స్ లో ప్రధాని మోడీ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో కరోనా పరిస్థితి గురించి ఈ సమావేశంలో మాట్లాడుతూ…. కేవలం 10 రాష్ట్రాల లోనే కరోనా వైరస్ ఎఫెక్ట్ ఎక్కువగా ఉందని చెప్పుకొచ్చారు. ఈ పది రాష్ట్రాలలో కరోనా వైరస్ ని కట్టడి చేయగలిగితే… దాదాపు దేశం కరోనా వైరస్ ని జయించినట్లే అంటూ పేర్కొన్నారు. మరోపక్క దేశంలో కరోనా వైరస్ మరణాల శాతం తగ్గటం శుభపరిణామం అని మోడీ అన్నారు.
కరోనా పరీక్షల సంఖ్య పెంచాల్సిన అవసరం ఉందన్నారు. ముఖ్యమంత్రులతో జరిగిన ఈ సమావేశంలో కరోనా కంట్రోల్ చేయడం విషయంలో పలు సూచనలు మోడీ సూచించారు. దేశంలో ఉన్న ఈ పది రాష్ట్రాలు టీం వర్క్ తో కట్టడి చేయాలన్న ఆలోచనతో ముందుకు వెళ్లాలని పేర్కొన్నారు. అదే రీతిలో తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువ శాతం టెస్టులు చేస్తే బెటర్ అని ఆ రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు.
కరోనా వైరస్ పరిస్థితిపై మోడీ తాజాగా నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ ఏడోసారి. మొత్తంమీద చూసుకుంటే మహారాష్ట్ర ఏపీ తెలంగాణ, గుజరాత్, యూపీ, పంజాబ్, తమిళనాడు, కర్ణాటక, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలలో కరోనా వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉందని… ప్రభుత్వాలు సరైన రీతిలో నిర్ణయాలు తీసుకోవాలని మోడీ సూచించారు.