Ys Jagan : ఏపీ సీఎం వైఎస్ జగన్ విద్యా వ్యవస్థలో అనేక మార్పులు తీసుకువచ్చి నిర్ణయాలు తీసుకున్న సంగతి తెలిసిందే. బయట ప్రపంచంలో ఉద్యోగాలు పొందు కోవాలి అంటే..ప్రపంచంతో పోటీ పడాలి అంటే చిన్ననాటి నుండి పిల్లలకు ఇంగ్లీష్ విద్యా విధానం ఉంటే బాగుంటుంది అని.. ఇంగ్లీష్ మీడియం తప్పనిసరి చేస్తూ విద్యా వ్యవస్థను తీర్చిదిద్దడం జరిగింది. అంతేకాకుండా నాడు నేడు కార్యక్రమం ద్వారా పాఠశాల రూపురేఖలను మార్చటమే కాక “జగనన్న గోరుముద్ద” ద్వారా మధ్యాహ్నం భోజనం లో పిల్లలకు మంచి పోషకాలు అందించే ఆహారాన్ని అందిస్తూ ఉంది జగన్ సర్కార్.
“అమ్మ ఓడి” ద్వారా పల్లెల ఎకౌంట్లో డబ్బులు జమ చేస్తూ..పిల్లల చదువు తల్లిదండ్రులకు భారం కాకుండా ముందడుగు వేసిన జగన్ సర్కార్ “జగనన్న విద్యా కానుక” ద్వారా పుస్తకాలు మరియు యూనిఫామ్ లు అందించడం మనకందరికీ తెలిసిందే. ఇదిలా ఉంటే తాజాగా ఇదే ఈ కార్యక్రమంలో భాగంగా పిల్లలకు మరో అదిరిపోయే గిఫ్ట్ అందించడానికి జగన్ ప్రభుత్వం సన్నద్ధమైంది. మేటర్ లోకి వెళ్తే “జగనన్న విద్యా కానుక” లో తెలుగు – ఇంగ్లీష్ డిక్షనరీ ఉచితంగా అందించాలని ప్రభుత్వం డిసైడ్ అయ్యింది.
వచ్చే అకాడమిక్ సంవత్సరం నుండి ..ఇంగ్లీష్ డిక్షనరీ ఇచ్చే ఆలోచన చేస్తూ ఉంది ప్రభుత్వం. అంతేకాకుండా వైఎస్సార్ ప్రీ ప్రైమరీ స్కూళ్లలో ఇంగ్లిష్– తెలుగు డిక్షనరీ ద్వారా పిల్లలు ప్రతి రోజూ ఒక పదం చొప్పున నేర్చుకునేలా చూడాలని, ఈ తరహాలోనే అంగన్వాడీల్లో కూడా ఒక కార్యక్రమాన్ని అమలు చేయాలని సీఎం జగనన్న సూచన.. మార్చి 20వ తేదీ నుంచి పుస్తకాల పంపిణీ ప్రారంభించి, ఏప్రిల్ 5 నాటికి పూర్తి చేసే విధంగా విద్యాశాఖ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.