Ghatkesar : ఇటీవల హైదరాబాద్లో కిడ్నాప్ డ్రామా అడి కుటుంబ సభ్యులను, పోలీసులను తప్పుదోవ పట్టించిన ఫార్మసీ విద్యార్థిని నేడు ఆత్మహత్య చేసుకుంది. ఈ నెల 10వ తేదీన హైదరాబాద్ శివారులో జరిగిన సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కల్గించింది. అయితే ఆ రోజు జరిగింది కిడ్నాప్ కాదనీ పోలీసుల దర్యాప్తులో తేలింది. తనను ఆటో డ్రైవర్లు కిడ్నాప్ చేసి అత్యాచారం చేశారని ఫార్మసీ విద్యార్థిని చెప్పడంతో పోలీసులు సీసీ పుటేజ్ ఆధారంగా ఆటో డ్రైవర్ ను పట్టుకుని విచారణ జరిపారు. దానిలో ఆటో డ్రైవర్ తప్పేమి లేదని పోలీసులు కనుగొన్నారు.
సదరు ఫార్మసీ విద్యార్థిని మిత్రుడితో కలిసి వెళ్లింది. తల్లి పదేపదే ఫోన్ చేయడంతో తానను ఆటో డ్రైవర్ కిడ్నాప్ చేశాడని చెప్పడంతో వారు కంగారు పడి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు దర్యాప్తు జరిపి కిడ్నాప్ కట్టుకథగా తేల్చేశారు. అయితే ఆ ఘటన అనంతరం ఆమె డిప్రెషన్ లోకి వెళ్లినట్లు తెలుస్తోంది. సదరు విద్యార్థిని ఘట్కేసర్ లోని ఆమె అమ్మమ్మ వారి ఇంటికి వెళ్లి షుగర్ టాబ్లెట్స్ మింగి ఆత్మహత్యకు యత్నించింది. వెంటనే ఆమెను ఘట్ కేసర్ లోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.