బహుముఖ ప్రజ్ఞాశాలి శ్రీపతి పండితారాధ్యుల బాల సుబ్రమణ్యం (ఎస్ పి బాలు) ప్రముఖ గాయకుడిగా, సంగీత దర్శకుడిగా, నటుడిగా, డబ్బింగ్ ఆర్టిస్ట్ గా సినీ రంగంలో రాణించిన కలికితురాయి . బాలు ప్రస్థానం విషయానికి వస్తే…
1946 జూన్ నాల్గవ తేదీన నెల్లుూరు జిల్లా కొనేటమ్మపేట గ్రామంలో జన్మించిన బాలుకి చిన్న తనం నుండి పాటలు పాటడం చాలా ఇష్టంగా ఉండేది. తండ్రి కోరిక మేరకు మద్రాస్ వెళ్లి ఇంజనీరింగ్ (ఏఎంఐఇ)లో చేరారు. ఇంజనీరింగ్ చదువుతున్న సమయంలోనే సినీ రంగంలో పాటలు పాడేందుకు అవకాశం లభించింది. 1966లో నుటడు, నిర్మాత పద్మనాభం రూపొందించిన శ్రీశ్రీశ్రీ మర్యాద రాామన్న చిత్రంలో పాటలు పాడే అవకాశం లభించింది. అప్పటి నుండి సినీ రంగంలో ఆయన ప్రస్థానం ప్రారంభమైంది. అమరగాయకుుడు ఘంటశాల వారసుడుగా సినీ పరిశ్రమలో నిలదొక్కుకున్నారు. శంకరాభరణం, సాగర సంగమం వంటి మేటి తెలుగు చిత్రాలే కాకుండాా ఏక్ దుబే కేలియే లాంటి హిందీ చిత్రాల్లోనూ ఆయన పాడిన పాటలు దేశ వ్యాప్తంగా సంగీతాభిమానుల హృదయాల్లో నిలిచిపోయాయి. గాయకుడిగా తనను పరిచయం చేసిన సినీ సంగీత దర్శకుడు కోదండపాణి పై ఉన్న గౌరవం, అభిమానంతో బాలు నిర్మించిన ఆడియో ల్యాబ్ కు ఆయన పేరు పెట్టారు.
బాలు 40 ఏళ్ల సినీ ప్రస్థానంలో 11 భాషలకు చెందిన 40వేలకు పైగా పాటలు పాడటంతో పాటు 40 సినిమాలకు సంగీత దర్శకత్వం వహించి ప్రపంచ రికార్డు సాధించారు. తెలుగు, తమిళమే కాకుండా కన్నడంలో కూడా బాలు పాడిన పాటలకు జాతీయ పురస్కారాలు దక్కాయి. డబ్బింగ్ ఆర్టిస్ట్ గా పలువురు ప్రముఖ నటులకు గాత్రదానం చేశారు. కమల్ హాసన్, రజనీకాంత్, సల్మాన్ ఖాన్, జెమిని గణేశన్, గిరీష్ కర్నాడ్, విష్ణు వర్థన్, రఘువరన్, నగేష్, అర్జున్ తదితర ప్రముఖ నటులకు గాత్రదానం చేశారు బాలు. సినిమాల్లోనే కాక పాడుతా తీయగా, పాడాలని ఉంది లాంటి టీవీి కార్యక్రమాలను నిర్వహించి ఏంతో మంది నూతన గాయనీ, గాయకులను పరిచయం చేశారు. స్వరాభిషేకం వంటి కార్యక్రమాల్లో తన గానమాధుర్యంతో సంగీతాభిమానులను రంజింపజేశారు.
భారత ప్రభుత్వం బాలుకు 2001లో పద్మశ్రీ,. 2011లో పద్మభూషణ్ పురస్కారాలతో సత్కరించింది. ఏపి ప్రభుత్వం నుండి వివిధ విభాగాల్లో 25పర్యాయాలు పురస్కారాలు అందుకున్నారు 2012లో బాలు నటించిన మిధునం సినిమాకు నంది ప్రత్యేక బహుమతి అందుకున్నారు. బాలు తన సినీ ప్రస్థానంలో ఆరు జాతీయ పురస్కారాలు, ఆరు ఫిల్మ్ ఫేర్ దక్షిణాది పురస్కారాలు, ఒక ఫిల్మ్ ఫేర్ పురస్కారం అందుకున్నారు.