ఈ కరోనా సంక్షోభ సమయంలో ఉన్నట్టుంది ఒక్కసారిగా మెగా-నంద మూరి వార్ మొదలైంది. ఇప్పుడు వారిరువురి ఫ్యాన్స్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి నెలకొంది. మొదట బాలకృష్ణ చిరంజీవి ఇంట్లో సినీ ప్రముఖులంతా సమావేశమైన దానిపై స్పందిస్తూ తన పిలవలేదని ఆగ్రహం వ్యక్తం చేసి బహిరంగంగా అందరినీ దూషించిన విషయం తెలిసిందే. బాలయ్య కౌంటర్ కి నాగబాబు కౌంటర్ సినీ వర్గాల్లో ఇప్పుడు రచ్చ లేపుతోంది. సోషల్ మీడియాలో లో నాగబాబు బాలయ్య కు ఇచ్చిన కౌంటర్లపై నందమూరి అభిమానులు తిట్ల దండకం అందుకున్నారు. ఇక మెగా ఫ్యాన్స్ మా వాళ్ళ జోలికే వస్తారాఅన్నట్లు బాలయ్యను ఇష్టం వచ్చినట్లు ట్రోల్ చేస్తున్నారు.
నిజాయితీగా చెప్పాలంటే గతంలో లేపాక్షి ఉత్సవాలు సందర్భంలో బాలకృష్ణ మెగా ఫ్యాన్స్ ని గిల్లి చెడామడా తిట్టించుకున్నారు. ఇండస్ట్రీ వారిని ఎవరినీ తాము పిలవమని మరియు అతని వల్ల చరిష్మా పొందగలిగే సినీ ప్రముఖులు చాలామంది ఉన్నారని…. కానీ ఆ అవకాశం ఎవరికీ ఇవ్వను అని బాలకృష్ణ చెప్పిన విషయం అందరికీ గుర్తుంది. అప్పుడు కూడా నాగబాబు చిరంజీవి కి సపోర్ట్ గా మాట్లాడాడు. అయితే ఈసారి మేటర్ చాలా సీరియస్. బాలయ్య ఒక్కసారిగా సినిమా వాళ్ళు అంతా కలిసి సమావేశమై రియల్ ఎస్టేట్ బిజినెస్ లు చేస్తూ భూములు పంచుకుంటున్నారు అని నిరాధారమైన ఆరోపణలు చేశారు. దీంతో నాగబాబుకి తిక్కరేగి బాలకృష్ణుడు ఎడాపెడా తిట్టేశాడు.
అయితే ఇందులో చరణ్ కు మరియు జూనియర్ ఎన్టీఆర్ కు ఎటువంటి సంబంధం లేదు కానీ ఆర్ ఆర్ ఆర్ చిత్రంతో మెగా అభిమానులు మరియు నందమూరి అభిమానులు కలిసిపోతారని అంతా భావించే సమయానికి బాలయ్య స్టేట్మెంట్ తో మొత్తం మంట కలిసి పోయింది అని చెప్పాలి. ఇక నాగబాబు ఇచ్చిన స్ట్రాంగ్ కౌంటర్ తో నందమూరి మెగా ఫ్యాన్స్ మధ్య పెద్ద వార్ మొదలైంది. ఈ గొడవ ఎక్కడ పెద్దదై పోయి తన ప్రెస్టీజియస్ మూవీ పైన పడుతుందేమోనని మరొక పక్క రాజమౌళి టెన్షన్ పడుతున్నాడు.
ఇప్పటికే కరోనా దెబ్బకు ప్రాజెక్టు గాడితప్పిన నేపథ్యంలో ఎలాగైనా బాహుబలి కలెక్షన్లు కొట్టాలని కసితో ఉన్న ఇద్దరి హీరోలకు ఈ ఫ్యాన్ వార్ ఒక పెద్ద అడ్డంకి లాగా కనిపిస్తోంది. హీరోలిద్దరూ ఈ వివాదాన్ని ఎలా ఫేస్ చేస్తారనే విషయాన్ని పక్కనపెడితే… ఆర్ఆర్ఆర్ కు ఈ సెగ తగలకుండా ఎలా జాగ్రత్తపడతారనేది ఇక్కడ కీలకమైన అంశం. ఒకవేళ ఎక్కడైనా తేడా కొడితే మాత్రం సినిమా వివాదాల్లోకి వచ్చినట్టే లెక్క.