మీరు రోజూ కరోనా హెల్త్ బులిటెన్ ను ఫాలో అవుతున్నట్లు అయితే తెలంగాణ రాష్ట్ర హెల్త్ బులిటెన్ మరియు ఆంధ్ర రాష్ట్ర హెల్త్ బులిటెన్ కి మధ్య తేడాను గమనించవచ్చు. అయితే ఎంత కాదన్నా గ్రేటర్ హైదరాబాద్ వంటి మహానగరం వలన తెలంగాణలో కరోనా వ్యాధి తీవ్రత ఎక్కువగానే ఉంది. అయితే ఆంధ్రప్రదేశ్ లో మాత్రం అందుకు ఏ మాత్రం తీసిపోని విధంగా కరోనా రోజురోజుకి పెరిగిపోతుంది కానీ మన మీడియా వారికి మాత్రం కేవలం హైదరాబాద్ కేసులే కనిపిస్తాయి. వాటి ద్వారానే వారు తమ ఛానల్ రేటింగ్ పెంచుకుంటారు కానీ ఏపీ లో జరుగుతున్న దారుణాన్ని మాత్రం ప్రజల కళ్ళకు కనపడనివ్వరు.
వివరాల్లోకి వెళితే నిన్న ఒక్కరోజే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కారణంగా 38 మంది చనిపోయారు అంటే అది మామూలు విషయం కాదు. ఇక ఈ రోజున 43 మంది ఈ వైరస్ సోకి మృత్యువాత పడటం గమనార్హం. దీనిని బట్టి చూస్తే ఆంధ్రప్రదేశ్ లో వైద్య సదుపాయాల కొరత మరియు డాక్టర్ల యొక్క వైఫల్యత ఎంత మాత్రం ఉందో అందరికీ అర్థమవుతుంది. నిజానికి డాక్టర్ల వైఫల్యత అనడం కన్నా ప్రభుత్వం వైరస్ సోకిన వారి పట్ల తగిన జాగ్రత్తలు తీసుకోవడం లేదని చెప్పడం ఇంకా సముచితంగా ఉంటుందేమో. కానీ ఏ ఒక్క మీడియా ఛానల్ కానీ ఈ విషయాన్ని అసలు హైలెట్ చేయకపోవడం ఇక్కడ గమనార్హం.
ఏమన్నా అంటే జగన్ రోజుకి వేలాది వేల కరోనా టెస్టులు చేయిస్తున్నారు ఇక అంతకుమించి ఏ పాలకుడు మాత్రం ఏం చేయగలడు అన్నట్లు స్క్రోలింగ్ లు వేస్తారు. ఇక రోజుకొక రికార్డు నమోదు అవుతుంటే అసలు ఏపీ లో కరోనానే లేదన్నట్లు వార్తలు తాపీగా చెబుతారు. కానీ తెలంగాణాకు వచ్చేసరికి సీన్ రివర్స్ అవుతుంది. చిన్నదైనా పెద్దదైనా.. ఆ విషయాన్ని తిప్పి తిప్పి హైలైట్ చేయాల్సిందే. అసలు డబ్ల్యూహెచ్వో కరోనా అనివార్యం అన్నట్లు చెపోంది. ఇప్పుడిప్పుడే ఇది పోదు అని కూడా నొక్కి వక్కాణిస్తున్న ఈ సమయంలో వీలైనన్ని ఎక్కువ ప్రాణాలు కాపాడటమే లక్ష్యంగా రాష్ట్ర వైద్య శాఖ మరియు ఆరోగ్య శాఖ పని చేయాలి.
కానీ టెస్టులు జరుపుకుంటూ అందులో పాజిటివ్ వచ్చిన వారిని గాలికి వదిలేస్తే వచ్చే ఉపయోగం ఏమిటని ఇక్కడ వైద్య నిపుణుల ప్రశ్న. ఇవే ఫలితాలు కనుక తెలంగాణ రాష్ట్రంలో వచ్చి ఉంటే ఈపాటికి కేసీఆర్ పైన మీడియా విపరీతంగా దుమ్మెత్తిపోసేది. ఇప్పుడు చేస్తున్న హంగామా కన్నా రెట్టింపు చేసే వారు. మరి జగన్ కు మాత్రం డ్రామా నియమాలు వర్తించవా? అంటే జగన్ తో వీరికి పని లేదా.. లేక కేసీఆర్ అన్నా ఆంధ్ర ప్రజల ప్రాణాలన్నా లెక్క లేదా..? అసలు ఏపీ లో జరుగుతున్న ఘోరాన్ని చూపే మీడియానే లేదా? ఇవే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని సామాన్యుడి ప్రశ్నలు.