Madugu Tamara: గ్రామాలలో నివసించే వారు నిత్యం మనం ఈ మొక్కను చూస్తూనే ఉంటారు..ఈ మొక్కను చెరువు గట్టు పక్కన, నీటి మడుగు వద్ద, కాలవ దగ్గర, నీరు ఎక్కువగా ఉండే చోట ఒడ్డున కనిపిస్తుంది.. దీనిని ఆరా కూర, మునుగు తామర, మడుగు తామర అని పిలుస్తారు.. ఇది మన దేశంలోనే కాకుండా చైనా జపాన్, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ బంగ్లాదేశ్ కూడా ఉన్నాయి. . ఈ ఆకులను కూరగా పప్పుగా వండుకుని తినవచ్చు.. ఈ మడుగు తామర వలన మనకు ఎటువంటి ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుస్తుందో చూద్దాం..!!
ఈ ఆకుకూర తినటం వలన చక్కటి నిద్ర కు ప్రేరేపిస్తుంది. హాయిగా నిద్ర పడుతుంది. నిద్రలేమి సమస్యతో బాధపడుతున్న వారు ఈ ఆకు కూర తింటే మెరుగైన ఫలితాలు కనిపిస్తాయి. ఈ ఆకు కూరలను తినడం వలన శారీరక శ్రమ, ఒత్తిడి, మానసిక ఒత్తిడి, డిప్రెషన్ ను దూరం చేస్తుంది. ఇందులో ఉండే విటమిన్ ఎ కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. దృష్టి లోపాలను సరి చేస్తుంది. మునుగు తామర మొక్కలను వేరుతో సహా తీసుకొచ్చి బాగా కడిగి బాగా మెత్తగా నూరి ఈ ముద్దను తల పై రాసి కట్టులా వేయాలి. ఇలా చేస్తే తలనొప్పి, మైగ్రేన్ తలనొప్పి నుంచి వెంటనే ఉపశమనం లభిస్తుంది.
గొంతు నొప్పి, గొంతు గరగర, కఫం తగ్గడానికి ఈ ఆకులను కు కళ్ళు ఉప్పు కలిపి కాసిని చిన్నుల్లిపాయ రెబ్బలు వేసి ముద్దగా నూరుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తింటూ ఉంటే అన్ని రకాల గొంతు సమస్యలను తగ్గిస్తుంది. ఈ మొక్క సమూలంగా సేకరించి కషాయం లాగా కాచుకుని తాగితే డెంగ్యూ ఫీవర్ ను తగ్గిస్తుంది. తేలు పాము కరచిన చోట ఈ ఆకులను మెత్తగా నూరి కట్టు వేసి గట్టిగా కట్టు కట్టాలి. ఇలా చేస్తే శరీరానికి విషం పాకదు. మూర్చ రోగం తో బాధపడుతున్న వారు ఈ ఆకుల లో పెరుగు కలిపి ముద్దగా నూరి సమస్య ఉన్నచోట రాస్తే మెరుగైన ఫలితాలు కనిపిస్తాయి.