Kunal Bahl: ప్రపంచ కుబేరుడు, టెస్లా అధినేత ఎలాన్ మస్క్ రీసెంట్ గా 43 బిలియన్ డాలర్లకు ట్విట్టర్ కొనుగోలు చేస్తానంటూ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పెద్ద సంఖ్యలో నెటిజన్ లు అదే డబ్బుతో ఆర్ధిక సంక్షోభం తో దెబ్బతిన్న శ్రీలంక ను ఆదుకోవాలని కోరుతున్నారు. ఇదే సందర్భంలో స్నాప్ డీల్ సీఈ ఓ కునాల్ చేసిన ఆసక్తికర ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది.
Kunal Bahl: సిలోన్ మస్క్ గా పిలిపించుకోవచ్చు
’45 బిలియన్ డాలర్ల తో శ్రీలంక ను కొనుగోలు చేసి తనను తాను సిలోన్ మస్క్ గా పిలిపించుకోవచ్చు గా’ అంటూ కునాల్ ట్వీట్ చేసారు. మరో ఎనిమిది బిలియన్ డాలర్ల ను కలుపుకొని శ్రీలంక ను అప్పుల ఊబి నుండి బయట పడేయాలని పలువురు నెటిజన్ లు ట్వీట్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ట్వీట్ లు సోషల్ మీడియా లో వైరల్ అయ్యాయి. కునాల్ మరియు నెటిజన్ ట్వీట్ ల పై ఎలాన్ మస్క్ ఇంత వరకు స్పందించలేదు.
శ్రీలంక స్వాతంత్ర్యం పొందిన తరువాత మొట్టమొదటి సారి అత్యంత దారుణమైన పరిస్థితి ని ఎదుర్కొంటోంది. ఆ దేశం విదేశి అప్పులపై చేతులు ఎత్తేసింది. బయటి అప్పులు తీర్చే పరిస్థితి లేదని ప్రకటించింది. ఆ దేశంలో ఆర్థిక సంక్షోభం రోజురోజుకు తీవ్ర మవుతూ నిత్యావసర వస్తువుల కొరత ఏర్పడుతోంది. శ్రీలంక కు దాదాపు 51 బిలియన్ డాలర్ల విదేశీ ఋణం ఉంది.