కార్ల ఇంజన్ ను అభివృద్ధి చేసి ప్రపంచానికి అందించిన సంస్థలలో మెర్సిడెస్ బెంజ్ ఒకటి. సంస్థ ప్రారంభించిన నాటి నుండి నాణ్యత ప్రమాణాలు, పనితీరులో అత్యధిక స్థానంలో ఉంది. మెర్సిడెస్ బెంజ్ కార్లు వీధుల్లోకి వెళ్ళినప్పుడు, అది ప్రజల హృదయాల్లో ఒక చెరిగిపోని ముద్రను వేస్తుంది. జర్మనీకి చెందిన లగ్జరీ కార్ల తయారీ సంస్థ మెర్సిడెస్ బెంజ్. తన జి-క్లాస్ ఉత్పత్తిని 4 లక్షల యూనిట్లు పూర్తి చేసినట్లు ప్రకటించింది..! బెంజ్ కంపెనీ 40000 వ వాహనంగా మెర్సిడెస్ బెంజ్ జి 400 డి వెర్షన్ను మార్కెట్లో విడుదల చేసింది.. ఈ లగ్జరీ కార్ ఫీచర్స్, ప్రత్యేకతలు ఇలా..
ప్రస్తుతం కంపెనీ ఐకానిక్ కార్లలో 20 యూనిట్లు ఉంచబడ్డాయి. తన మొదటి జి-క్లాస్ కార్ను 1979 లో ప్రవేశపెట్టింది. ఇది 2017 సంవత్సరంలోనే కంపెనీ 300,000 యూనిట్ల ఉత్పత్తిని సాధించింది. అయితే ఇంత తక్కువ సమయంలో కంపెనీ 4 లక్షల యూనిట్లను ఉత్పత్తి చేసిందని కంపెనీ ప్రకటించింది..
భారత మార్కెట్లో మెర్సిడెస్ బెంజ్ తన జి-క్లాస్ శ్రేణిలో రెండు వేరియంట్లను విక్రయిస్తుంది. ఇందులో మెర్సిడెస్ బెంజ్ జి 63 ఎఎమ్జి, జి 350 డి ఉన్నాయి. ఇవే కాకుండా, ఇక్యూ సబ్ బ్రాండ్లో భాగమైన జి-క్లాస్ యొక్క ఎలక్ట్రిక్ వెర్షన్పై కూడా అందిస్తుంది. దీనిని 2019 అక్టోబర్లో భారత మార్కెట్లో విడుదల చేశారు. భారతదేశంలో ఎక్స్ షోరూం ధర రూ. 1.5 కోట్లలు.
ఫీచర్లు:
ఇది 20 ఇంచెస్ అల్లాయ్ వీల్స్ దీని గ్రౌండ్ క్లియరెన్స్ 241 మిమీ, వాటర్ వాడింగ్ కెపాసిటీ 700 మిమీ, 12.3 ఇంచెస్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ కూడా ఉంది.
ఈ వెర్షన్ కారులో 3.0-లీటర్, 6-సిలిండర్ డీజిల్ ఇంజిన్ను ఉపయోగిస్తారు. ఇది 282 బిహెచ్పి శక్తిని, 600 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఈ ఇంజిన్ 9-జి ఆటోమేటిక్ గేర్బాక్స్కి జతచేయబడి ఉంటుంది. ఈ కారుని చాలామంది సెలబ్రెటీలు కలిగి ఉన్నారు.