హౌస్ కి కొత్తగా కెప్టెన్ అయినా సోహెల్ ఫస్ట్ డే ఇంటిలో నీళ్లు రాకపోవటంతో అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. బిగ్ బాస్ కి కెమెరాల ముందు విన్నవించుకోవడం తో వెంటనే హౌస్ లో నీళ్లు రావడం జరిగింది. ఆ తర్వాత లగ్జరీ బడ్జెట్ టాస్క్ లో మెహబూబ్ అఖిల్ తలపడ్డారు. చివరాకరికి మెహబూబ్ గెలవడం జరిగింది. ఆ తర్వాత ఇంటి సభ్యులందరూ మార్నింగ్ మస్తీ లో మనసులో ఉండిపోయిన తమ సందేశాలను పంచుకోవాలని బిగ్ బాస్ టాస్క్ పెట్టడం జరిగింది. ఈ సందర్భంగా నోయల్ తన తల్లి గురించి చెబుతూ ఆమె తన జీవితంలో బెస్ట్ ఫ్రెండ్ అని తెలిపింది.
ఇదే టాస్క్ లో అవినాష్ మాట్లాడుతూ… నేను నా జీవితంలో పల్లి దండ్రులను ప్రేక్షకులను మాత్రమే నమ్ముతా. కానీ ఇటీవల లాక్డౌన్ సమయంలో ఆత్మహత్య చేసుకుందామనుకున్న. ఎందుకంటే ఇల్లు కొన్నాను కాని EMI కట్ట లేక పోయాను… పైగా అదే సమయంలో నాన్నకి గుండెపోటు వచ్చింది. మూడు స్టెంట్లు వేయడానికి ఇందుకోసం నుంచి నాలుగు లక్షల రూపాయలు నాన్నకి ఖర్చు పెట్టాల్సి వచ్చింది. అదేవిధంగా తల్లికి కీళ్లు అరిగి పోతే వైద్యం చేయించాను. దీంతో చేతిలో చిల్లిగవ్వ లేదు. ఇక అప్పు తీర్చడానికి బయట మరోసారి అప్పు చేయాల్సి వచ్చింది. ఎంత సాహసానికి చేయటం కారణం నా తల్లిదండ్రులు నా సంరక్షణలోనే పెరగాలి వారిని ఓల్డ్ ఏజ్ హోమ్ లో ఎవరు కూడా వృద్ధాప్యంలో పెట్టకండి అంటూ అవినాష్ చెప్పుకొచ్చాడు.
ఇదే తరుణంలో గంగవ్వ మాట్లాడుతూ తనకు చిన్న వయసులోనే పెళ్లి అయిందని 17 ఏళ్లకే కొడుకు పుట్టాడు అని ఇంకో రెండు సంవత్సరాల కు కూతురు పుట్టింది అని తెలిపింది. కానీ భర్త రోజూ తాగి వచ్చి ఇంట్లో కొట్టేవాడని తర్వాత విదేశాలకు వెళ్లి పోయాడు అని తెలిపింది. అలాంటి సమయంలో కూతురు పుట్టిన గా ఆమెకు ఫిట్స్ రావటం తో ఆమెను ఎత్తుకుని హాస్పిటల్కి తీసుకువెళ్లడం కోసం నడక ప్రారంభించిన అప్పట్లో బస్సు కూడా ఊర్లోకి వచ్చేది కాదని చెప్పుకొచ్చింది. ఆ సమయంలో ఊరు నుంచి వెళ్ళే బండి నన్ను చూసి ఎక్కించుకుని జగిత్యాల ఆసుపత్రికి బిడ్డను పట్టుకుని తీసుకెళ్లడం జరిగింది అని కానీ చివరాకరికి బిడ్డ చనిపోయిందని… చనిపోయిన బిడ్డను ఎత్తుకుని తిరిగి వస్తుండగా బస్సు లోకి నన్ను రానీయ లేదని బాధ పడింది. ఆ తర్వాత ఆటో కట్టించుకునే ఇంటికి వెళ్ళాను అంటూ బోరున ఏడ్చేసింది.
చాలావరకూ శుక్రవారం జరిగిన ఎపిసోడ్లో భావోద్వేగంగా ఇంటి సభ్యులు తమ అనుభవాలు చెప్పడం జరిగింది. ఈ తరుణం లో గంగవ్వ మరియు అవినాష్ చెప్పిన సందర్భాలు చాలా మందిని కదిలించాయి. హౌస్ లో ఎంత మంది నవ్వించే అవినాష్ జీవితంలో ఇలాంటి కఠిన పరిస్థితులు ఉన్నాయా అంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు కూడా బాధ పడ్డారు. చెప్పిన సంఘటన కూడా చాలామందిని కదిలించింది. కచ్చితంగా ఈ రెండు సంఘటనలు విని నాగార్జున కూడా కన్నీళ్లు పెట్టుకుంటారు అని మరికొంత మంది నెటిజన్లు విలా బాధలు విని సోషల్ మీడియాలో డిస్కషన్లు చేసుకుంటున్నారు.