సోనూసూద్ పెద్దగా పరిచయం లేని వ్యక్తి. ఎన్నో బాలీవుడ్, టాలీవుడ్ చిత్రాలలో విలన్ పాత్రలో నటించి అందరినీ ఆకట్టుకున్నాడు. రీల్ లైఫ్ లో విలన్ గా నటించినప్పటికీ రియల్ లైఫ్ లో మాత్రం హీరోగా ఆపదలో ఉన్న వారిని ఆదుకొని తన వ్యక్తిత్వాన్ని చాటుకున్నాడు. ఈ మధ్యకాలంలో చిత్తూరు జిల్లాలో ఓ రైతు తన సొంత కూతుళ్లను కాడెద్దులు గా మార్చి పొలం పనులు చేస్తున్న విషయం సోను సూద్ కంట పడటంతో ఆ రైతు కష్టానికి స్పందించి, వెంటనే ఆ రైతుకు ట్రాక్టర్ ను పంపించి తన మానవత్వాన్ని చాటుకున్నారు.
కరోనా సమయంలో వలస కూలీలు నడుస్తూ వారి ప్రయాణం సాగిస్తున్న నేపథ్యంలో సోను సూద్ వారి పరిస్థితి చూసి గుండె బరువెక్కడంతో వలస కూలీల గురించి ప్రత్యేక శ్రద్ధ తీసుకొని వారందరినీ ప్రత్యేక బస్సులు, రైళ్లలో, విమానాలలో వారి సొంత ప్రాంతాలకు తరలించడంతో సోనుసూద్ వ్యక్తిత్వం ఏమిటో తెలిసింది. అంతే కాకుండా ఎవరైనా ఆపదలో ఉన్నారని సోనుసూద్ కి తెలిస్తే వెంటనే స్పందించి వారికి నేనున్నానంటూ భరోసా ఇస్తున్నాడు.ఇతని సేవలను కొనియాడుతూ దేశం మొత్తం ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
ఇంతటి సేవా భావం కలిగిన సోనుసూద్ విగ్రహాన్ని పశ్చిమ బెంగాల్, కలకత్తా లో ప్రఫుల్లా కనక్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన నవరాత్రి వేడుకల్లో భాగంగా దుర్గామాత మండపాల దగ్గర సోను సూద్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. కష్టాల్లో ఉన్నవారిని ఆదుకోవడంలో ఆ సోనుసూద్ ఎప్పుడు ముందుంటారని, అతనిపై ఉన్న గౌరవంతో ఈ విగ్రహ ఏర్పాటు చేశామని అక్కడి ప్రజలు తెలియజేశారు. ప్రస్తుతం సోను సూద్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారి నెటిజన్లను ఆకర్షిస్తున్నాయి. సోను సూద్ రియల్ హీరో అంటూ పలువురు నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.