దశాబ్దాల కాలం నాటి హిందువుల కల రామాలయం భూమి పూజకు అయోధ్య నగరం ఇప్పటికే సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. భూమి పూజకు ఇంకా కొద్ది గంటలు మాత్రమే మిగిలి ఉండటంతో అన్ని ఏర్పాట్లు సక్రమంగా జరిగాయా లేదా అన్నది శ్రీ రామ జన్మ భూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ సభ్యులు దగ్గరుండి చూసుకుంటున్నారు. ఒకవైపు ఉగ్ర ముప్పు పొంచి ఉండటంతో కేంద్ర ప్రభుత్వం కూడా అదనపు బలగాలు అక్కడ మోహరింప చేసి పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తోంది.
ఇదిలా ఉండగా అయోధ్య భూమి పూజకు సంబంధించి ప్రకటనలను భారత ప్రభుత్వం అమెరికా ప్రధాన నగరం న్యూయార్క్ లో టైమ్ స్క్వేర్ వద్ద ప్రదర్శించేందుకు ఏర్పాట్లు చేయగా…. ఆ దేశంలో ముస్లిం సంస్థలు దీనిపై అభ్యంతరం వ్యక్తం చేశాయి. ఒక మతానికి అనుకూలంగా ప్రకటనలను ప్రదర్శించడం సరికాదు అంటూ న్యూయార్క్ గవర్నర్, మేయర్, నగర పాలక మండలి చెత్త సభ్యులతోపాటు ఆ యాడ్ కంపెనీపై ఒత్తిడి తీసుకురావడంతో అయోధ్య భూమి పూజ ప్రకటనలను టైమ్ స్క్వేర్ వద్ద ప్రదర్శించడం లేదని యాడ్ కంపెనీ నిర్వాహకులు స్థానిక మీడియా సంస్థ క్లారిటీ ఇచ్చింది.
ఇదే రీతిలో స్వదేశంలో కూడా కొన్ని ముస్లిం సంస్థలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ముఖ్యంగా ముస్లిం వర్గాలకు అనుకూలంగా ఉండే రాజకీయ పార్టీల నేతలు తీవ్ర స్థాయిలో ఫైర్ అవ్వుతున్నారు. ప్రజాస్వామ్య దేశానికి ప్రధానిగా ఉన్న వ్యక్తి ఒక మతానికి చెందిన కార్యక్రమానికి ఎలా అధికారికంగా హాజరవుతారు అంటూ మోడీ అయోధ్య భూమి పూజకు వెళ్ళటం పై కొన్ని ముస్లిం సంస్థలు ఓవరాక్షన్ చేయడం ఇప్పుడు జాతీయ మీడియాలో హైలెట్ గా మారింది.
ఇదిలా ఉండగా ఆగస్టు 5వ తారీఖున మధ్యాహ్నం 12 గంటల 15 నిమిషాలకు మోడీ చేతుల మీదగా శంకుస్థాపన కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగే రీతిలో దేశంలో చాలా చోట్ల పెద్దపెద్ద ఎల్ఈడీ స్క్రీన్లు పెడుతున్నారు. మహమ్మారి కరోనా వైరస్ ఎఫెక్ట్ తో అతి తక్కువ ప్రముఖుల సమక్షంలో ఈ భూమి పూజ కార్యక్రమం జరుపుకోనుంది.