2019 సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో మోడీని టార్గెట్ చేసి చంద్రబాబు కాంగ్రెస్ తో చేతులు కలిపి దేశవ్యాప్తంగా బిజెపికి వ్యతిరేకంగా ప్రచారం చేయడం అందరికీ తెలిసిందే. ఆ సమయంలో ఏకంగా మోడీ భార్య ని, తల్లి ని టార్గెట్ చేసి చంద్రబాబు కాంట్రవర్షియల్ కామెంట్లు చేశారు. తీరా 2019 ఎన్నికల ఫలితాలు వచ్చాక సీన్ కట్ చేస్తే చంద్రబాబు భయంకరమైన ఓటమితో ఏపీలో ప్రతిపక్షంలో ఉండగా, భారీ మెజార్టీతో మోడీ రెండోసారి ప్రధాని అయ్యారు.
దాదాపు 40 సంవత్సరాల చంద్రబాబు రాజకీయ జీవితంలో కోలుకోలేని దెబ్బ 2019 ఎన్నికల ఫలితాల దెబ్బ అని, ఫలితాలు చూసిన సీనియర్ల విశ్లేషించారు. ఇదిలా ఉండగా భారీ మెజార్టీతో ఏపీలో అధికారంలోకి వచ్చిన జగన్…అటాకింగ్ మోడ్ లోకి వెళ్లడమే ప్లాన్ గా రంగం లోకి దిగుతూ, వచ్చిన అవకాశం అందుకోవడమే మంచిది అని కొద్దిపాటి మెజార్టీతో ప్రతిపక్షంలో ఉన్న టిడిపిని అడ్రస్ లేకుండా చేయాలని డిసైడ్ అయినట్లు టాక్. టిడిపి కోటలు బీటలు పడేలా ఆర్థికంగా, రాజకీయంగా గానూ జగన్ కోలుకోలేని దెబ్బలు కొడుతున్నట్లు ఏపీ రాజకీయాల్లో వార్తలు వస్తున్నాయి. ఇటువంటి తరుణంలో ఎలాగైనా పార్టీని కాపాడుకోవాలని చంద్రబాబు కేంద్రంలో అధికారంలో ఉన్న మోడీతో మళ్లీ మిత్రపక్షం వహించాలి అని తెగ ఆరాట పడుతున్నట్టు వార్తలు వస్తున్నాయి.
మోడీ తో ఒకసారి భేటీ అయి కలసి పని చేయడానికి చంద్రబాబు అనేక రాజకీయ ఎత్తుగడలు వేస్తున్నట్లు గత కొంత కాలం నుండి వార్తలు వస్తున్నే ఉన్నాయి. ఈనేపథ్యంలో కరోనా, ఇంకా అనేక విషయాలలో ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను ఎత్తిచూపుతూ వాటిని ఆధారం చేసుకుని మోడీతో కాంప్రమైజ్ అవటానికి చంద్రబాబు అనేక కుయుక్తులు చంద్రబాబు పన్నినా…మోడీ సైడ్ నుండి ఎలాంటి స్పందన ఇప్పటివరకు రాలేదు. కరోనా వైరస్ లాక్ డౌన్ సమయంలో మోడీ జాతినుద్దేశించి ప్రసంగించిన ప్రతి సారి తర్వాత వెంటనే చంద్రబాబు ప్రెస్ మీట్ పెట్టి మోడీ జపం చేయడం జరిగింది.
అయినా కానీ బిజెపి నుండి చంద్రబాబు పై కనికరం ఏ మాత్రం రాలేదు. మరోపక్క రాష్ట్రంలో జగన్ టిడిపి పార్టీలో కీలక నాయకులు, గత ప్రభుత్వంలో చేసిన అవినీతిని వెలుగులోకి తీసుకు వస్తూ, సాక్ష్యాధారాలతో సహా అరెస్టులు చేసుకుంటూ పోతున్నారు. పరిస్థితి ఇలా ఉండగా కేంద్ర ప్రభుత్వంతో ఏదో రీతిలో సయోధ్య కుదుర్చుకుని వైయస్ జగన్ ని కేంద్ర ప్రభుత్వంతో నిలువరించడానికి చంద్రబాబు ప్రయత్నాలు ఏమాత్రం ఆగడం లేదు. ఈ నేపథ్యంలో ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో “ఫోన్ ట్యాపింగ్” వ్యవహారం గురించి మోడీ కి చంద్రబాబు లెటర్ రాయడం జరిగింది. వెంటనే ఈ విషయంలో కలుగజేసుకుని ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని మోడీ ని కోరారు.
దేశ భద్రతకు ముప్పు తెచ్చే రీతిలో “ఫోన్ ట్యాపింగ్” ఏపీలో జరిగిందని వెంటనే కేంద్ర నిఘా సంస్థలు దీనిపై విచారణ చేయాలని ప్రభుత్వ వ్యవస్థలను కాపాడాలని చంద్రబాబు కోరారు. ఇదిలా ఉండగా ప్రస్తుతం ఏపీలో ఎప్పటినుండో అవకాశం కోసం ఎదురు చూస్తున్నా బిజెపి పార్టీ ప్రస్తుతం చాలా వరకు ప్రతిపక్ష పాత్ర పోషిస్తూ చాలా చురుకుగా వ్యవహరిస్తోంది. ఇలాంటి తరుణంలో చాన్నాళ్ల తర్వాత బిజెపికి ఏపీలో ప్రధాన పార్టీ పాత్ర పోషించే పరిస్థితులు ఉంటున్న తరుణంలో చంద్రబాబు లెటర్ నీ మినిమం కూడా మోడీ పట్టించుకోలేదని, పైగా తనని అనేక విమర్శలు చేసిన తరుణంలో చంద్రబాబుకి ఆల్మోస్ట్ ఆల్ మోడీ డోర్స్ అని క్లోజ్ చేసినట్లు బిజెపి పార్టీలో టాక్ వినపడుతోంది.