చైనాలో పురుడు పోసుకున్న కరోనా వైసర్ తొమ్మిది నెలలుగా ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు ప్రపంచంలో సుమారు 32 మిలియన్ ప్రజలు కరోనా భారిన పడ్డారు. పది లక్షల మంది వరకు మరణించారు. ఈ నేపథ్యంలో హాంకాంగ్ కు చెందిన ప్రముఖ వైరాలజిస్ట్ డాక్టర్ లి మెంగ్ యాన్ కరోనా వ్యాప్తి పై సంచలన వ్యాఖ్యలు చేశారు.
ప్రపంచం మొత్తం వ్యాపించిన కరోనా వైరస్ మొట్ట మొదటి సారిగా చైనాలోని వుహాన్ సీ ఫుడ్ మార్కెట్ నుంచి వ్యాప్తి చెందిందని బావిస్తున్నారు.కాని దాని కంటే ముందే వైరస్ చెలామణిలో ఉందని డాక్టర్ యాన్ తెలిపారు. చైనా ప్రభుత్వానికి కూడా వైరస్ వ్యాప్తి గురించి అవగాహన ఉందని పెర్కొంది. ఆమె వాదనలను బట్టి చూస్తే కరోనా వైరస్ 2019 నవంబరు లోనే ఉందని తెలుస్తుంది. ఈ విషయం ప్రపంచ ఆరోగ్య సంస్థకు కూడా తెలుసునని ఆమె వెల్లడించారు. ఈ వ్యాధిని నిరోధించడంలో ముందుగా పసిగట్టడంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ విఫలమైందని అమెరికా వంటి దేశాలు విమర్శిస్తున్న విషయం తెలిసిందే. డాక్టర్ యాన్ గత వారం యూకె కు చెందిన ఒక టెలివిజన్ కు ఇంటర్యూ ఇచ్చింది. దానిలో కూడా కోవిడ్ – 19 మానవునిచే రూపుదిద్దుకున్న వైరస్ అని స్పష్టం చేసింది.
చైనా ప్రయోగశాలలో నుండి ఈ వైరస్ ఎందుకు బయటకు వచ్చిందో, ఎందుకు తయారు చేశారో, సాక్ష్యాలతో సహా ప్రజలకు చెప్పడానికి తాను సిద్దంగా ఉన్నానని యాన్ పేర్కొన్నది. ఈ వ్యాధి గురించి చెప్పడానికి ప్రయత్నించిన మరో వైద్యుడు లి వెన్లియాంగ్ ఈ వ్యాధి సోకి మరణించాడు. వాస్తవానికి అతను డిశంబరులోనే కరోనా వైరస్ ను గుర్తించి హెచ్చరికలు జారీ చేశాడు. తదుపరి వూహాన్ లో 50 వేల కేసులు నమోదు అయ్యాయి. సామాజిక దూరం పాటించి, తగిన జాగ్రత్తలు పాటించడంతో అక్కడ తక్కువ సమయంలోనే సాధారణ స్థితికి చెరుకుంది అని యాంగ్ అన్నారు. ఎప్రియల్ నుండి చైనాలో కనపడకుండా పోయిన డాక్టర్ లిమెంగ్ యాంగ్ టెలివిజన్ కు ఇచ్చిన ఇంటర్యూ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతుంది.