NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

చంద్రబాబు వాడకం అలానే ఉంటుంది మరి! ఇప్పటికి అర్ధమయింది వారికి!!

వైసిపి నుంచి తెలుగుదేశం పార్టీలోకి వెళ్లిన ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలకు ఇప్పుడు ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు నిజస్వరూపం అర్థం అవుతోంది.

ఎమ్మెల్యేలుగా ఉండగా పార్టీలో కొచ్చినప్పుడు తమకు బ్రహ్మరథం పట్టిన చంద్రబాబు ఇప్పుడు తమ మొఖం కూడా చూడడం లేదని వారు వాపోతున్నారు.మొన్నటి ఎన్నికల్లో మాత్రం వారిలో ఒకరిద్దరికి మినహా మిగిలిన వారందరికీ చంద్రబాబు టిక్కెట్లు ఇచ్చారు.వారిలో అద్దంకి నుండి ఒక్క గొట్టిపాటి రవికుమార్ మినహాయిస్తే ఎవరూ గెలవలేదు.అయినప్పటికీ పాలపర్తి డేవిడ్ రాజు, ఆదినారాయణ రెడ్డి లను మినహాయిస్తే మిగిలిన 21మంది కూడా ఇప్పటికీ సాంకేతికంగా టిడిపిలోనే ఉన్నారు.అయితే వారినందరిని చంద్రబాబు పూర్తిగా పక్కన పెట్టేశారని భావన కలుగుతోంది.ప్రస్తుతం తెలుగుదేశం పార్టీకి శాసనసభలో ఉన్న బలం ప్రకారం ఎమ్మెల్సీ పదవిగానీ ఇంకో పదవి గానీ దక్కే అవకాశం ఎవరికీ లేదు.

కనీసం పార్టీ పదవి అయినా వస్తుందేమోనని ఎదురుచూసిన ఆ 21 మందికి నిరాశ తప్పలేదు. చంద్రబాబు తాజాగా ప్రక‌టించిన పార్లమెంట‌రీ జిల్లాల క‌మిటీల్లో ఈ జంపింగ్ జపాంగ్‌లు ఎవ్వరికి అవ‌కాశం ఇవ్వలేదు. పోనీ.. రెండేసి పార్లమెంట‌రీ జిల్లాల‌కు ఒక ఇంచార్జ్‌నునియ‌మించినా ఆ ప‌ద‌వుల్లోనూ ప్రయార్టీ లేదు. చివరకు వైసీపీ నుంచి వచ్చి తన పార్టీలో చేరి మంత్రి పదవులు పొందిన సుజయ రంగారావు అమర్నాథ్ రెడ్డి భూమా అఖిలప్రియలకు కూడా చంద్రబాబు పార్టీ పదవులు ఇవ్వలేదు.మరీ విచిత్రమైన విషయమేమిటంటే కాంగ్రెస్ నుంచి వచ్చిఆఖరి క్షణంలో టిడిపిలో చేరిన ప్రకాశం జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే ముక్కు ఉగ్రనరసింహారెడ్డి లాంటి వారిని ఆయన ఆదరించి పార్టీ పదవులిచ్చారు.

అలాగే పార్లమెంట్ నియోజక నియోజకవర్గాల వారీగా మహిళలకు కూడా చంద్రబాబు పదవులిచ్చారు.వారిలోనూ వైసీపీ నుంచి వ‌చ్చిన మ‌హిళ‌ల‌కు కూడా ప్రాధాన్యత లేదు.వైసీపీ నుంచి టీడీపీలోకి వ‌చ్చిన మ‌హిళా నేత‌ల్లోపాడేరు మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి, పామ‌ర్రు మాజీ ఎమ్మెల్యే ఉప్పులేటి క‌ల్పన, కర్నూలు జిల్లా జిల్లా పాణ్యం మాజీ ఎమ్మెల్యే చ‌రితారెడ్డి వంటివారు ఉన్నారు. వీరికి కూడా చంద్రబాబు ఛాన్స్ ఇవ్వలేదు.రంపచోడవరం మాజీ ఎమ్మెల్యే రాజేశ్వరికి మాత్రం పదవి ఇచ్చినా ఆమె డమ్మీనే.మ‌హిళా నేత‌ల‌కు ప‌ద‌వులు ఇవ్వాలంటే చాలా మంది ఫైర్‌బ్రాండ్లే ఉన్నారు.అయితే రాజేశ్వరికి మాత్రం పదవిచ్చి చంద్రబాబు మమ అనిపించారు.

చంద్రబాబు వైఖరిని గమనిస్తే ఆయన వైసిపి నేతలను వాడుకుని వదిలేసినట్లే .తెలుగుదేశం పాత కాపులకే ఆయన పార్టీలో పెద్దపీట వేస్తున్నారు.ఇంకా చెప్పాలంటే వైసిపి నుండి టిడిపిలో వచ్చిన వారిని ఆయన నమ్మడం లేదు. దీంతో వారి పరిస్థితి అగమ్యగోచరంగా తయారయింది. ఉన్న పార్టీలో విలువలేదు. వైసిపిలోకి వెళదామంటే దారి లేదు ఏం చేయాలా అని ఆ ఇరవై ఒక్క మంది తలలు పట్టుకుంటున్నారట.మరి అలావుంటది చంద్రబాబు వాడకం!

Related posts

గన్నవరం ఎయిర్ పోర్టులో ఎన్ఆర్ఐ వైద్యుడు లోకేశ్ నిర్బంధం, విడుదల .. అసలు ఏమి జరిగిందంటే ..?

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆ బీఆర్ఎస్ నేతను ఎందుకు అరెస్టు చేయడం లేదు ?: బీజేపీ నేత రఘునందనరావు

sharma somaraju

Telangana EAPCET: ఈఏపీ సెట్ ఫలితాలు విడుదల – టాప్ టెన్ ర్యాంకర్లు వీరే

sharma somaraju

SIT: విచారణ ప్రారంభించిన సిట్ ..రాజకీయ నేతలు, అధికారుల్లో గుబులు

sharma somaraju

EC: పల్నాడు కలెక్టర్, మూడు జిల్లాలకు ఎస్పీలను నియమించిన ఈసీ

sharma somaraju

Lok Sabha Elections 2024: కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధి కన్హయ్య కుమార్ పై దాడి .. దాడికి కారణం అదేనా..?

sharma somaraju

Siddhu Jonnalagadda: టిల్లు స్క్వేర్ స‌క్సెస్ తో భారీగా పెరిగిన సిద్ధు జొన్న‌ల‌గ‌డ్డ రెమ్యున‌రేష‌న్‌.. ఇప్పుడెన్ని కోట్లంటే..?

kavya N

Road Accident: పెళ్లి వేడుకలకు సిద్ధమవుతున్న వేళ ఘోర విషాదం .. వరుడు సహా అయిదుగురు దుర్మరణం

sharma somaraju

Serial Actor Chandrakanth: ప‌విత్ర‌తో ఐదేళ్లుగా స‌హ‌జీవ‌నం.. క‌ట్టుకున్న భార్య‌కు అన్యాయం.. చంద్రకాంత్ గురించి వెలుగులోకి వ‌చ్చిన సంచ‌ల‌న నిజాలు!

kavya N

Malla Reddy: స్థలాన్ని ఆక్రమించుకుంటున్నారంటూ మాజీ మంత్రి మల్లారెడ్డి ఫైర్ .. సుచిత్ర పరిధిలో ఉద్రిక్తత

sharma somaraju

Prasanna Vadanam: ఆహాలో అల‌రించ‌బోతున్న సుహాస్ స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ ప్ర‌స‌న్న‌వ‌ద‌నం.. స్ట్రీమింగ్ డేట్ ఇదే!

kavya N

వైసీపీ Vs టీడీపీ: ఈ ఐదే ఓట‌ర్ల‌ను తిక‌మ‌క పెట్టాయా ?

ఏపీ వార్‌: ఈ విధ్వంసం వెన‌క ఎక్క‌డ .. ఏం జ‌రిగింది ?

లోకేష్ కోసం.. మ‌రో ఐదేళ్లు వెయిట్ చేయాల్సిందేనా..!

ద‌ర్శి : చివ‌రి ఓటు కౌంటింగ్ వ‌ర‌కు గెలిచేది ల‌క్ష్మా… శివ‌ప్ర‌సాదో తెలియ‌నంత ఉత్కంఠ‌..?