ఒక బ్యాంకులో పని చేస్తున్న 10 మంది ఉద్యోగులు ఉన్నట్టుండి ఒకేసారిగా మిస్ అయ్యారు. వారి కుటుంబ సభ్యులు ఎన్నిసార్లు కాల్ చేసినా.. కాల్స్ కలవడం లేదు. ఎటు పోయారో తెలియదు. ఏమైందో అసలు తెలియదు. దాంతో కుటుంబ సభ్యులకు భయం ఎక్కువైంది. వెంటనే పోలీసు స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేశారు. ఈ బ్యాంకు ఉద్యోగుట మిస్సింగ్ ఘటన నెల్లూరు జిల్లాలో చోటు చేసుకుంది.
10 మంది బ్యాంక్ ఉద్యోగులు అదృశ్యమైన ఘటన అందరినీ కలవర పెట్టింది. చివరకు ఆ బ్యాంకు ఉద్యోగులు క్షేమంగా ఉన్నారని తెలిసి అంతా ఊపిరి తీసుకున్నారు. వివరాల్లోకి పోతే.. ఒక బ్యాంకుకు చెందిన 10 మంది ఉద్యోగులు సదాశికోన జలపాతాన్ని చూడటానికి వెళ్లారు. అది చాలా దూరం ఉండటం, అక్కడ సిగ్నల్స్ సరిగ్గా లేకపోవడంతో ఆ పదిమంది ఉద్యోగులకు కాల్స్ కలవలేదు. దీంతో వారి ఆచూకీ తెయకపోవడం వల్ల నానా హడావిడి చేశారు వారి కుటుంబ సభ్యులు.
చివరకు ఫోన్ సిగ్నల్స్ రావడంతో కాల్స్ వెళ్లాయి. అందరూ క్షేమంగా ఉన్నారని తెలియడంతో కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. నెల్లూరు జిల్లాకు చెందిన ఆ బ్యాంక్ ఉద్యోగులు ఆదివారం సదాశివకోనకు విహార యాత్రకు వెళ్లారు. సోమవారం టెంపుల్ వెళ్లాలని డిసైడ్ చేశారు. దాంతో ఆరోజు వారంతా అడవిలో ట్రెక్కింగ్ కు వెళ్లారు.
ట్రెక్కింగ్ వెళ్లిన వారు అసలసిపోయారు.దాంతో ట్రాక్టర్ ఒకదాన్ని మాట్లాడుకున్నారు. వారంతా అలసిపోవడంతో ట్రాక్టర్ దగ్గరకు లేటుగా పోయారు. అయితే తిరుపతి వడమాలపేటకు వారు వెళ్తుండగా వారిని పోలీసులు గుర్తించారు. ఆదివారం ఆ ఉద్యోగుల ఫోన్లు కలవకపోవడంతో వారికుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో పోలీసులు విచరణ చేపట్టారు. దీంతో చిత్తూరు జిల్లా ఆఫీసర్లకు నెల్లూరు పోలీసులు సమాచారం ఇచ్చారు. దాంతో వారిని గాలిస్తుంటే వడమాల పేట దగ్గర కనిపించడంతో అంతా ఊపిరి తీసుకున్నారు. సిగ్నల్స్ లేకపోవడంతో కాల్స్ కలవలేదని ఆ ఉద్యోగులు పోలీసులకు తెలిపారు.