టాలీవుడ్ లో టాలెంటెడ్ హీరోయిన్ గా నివేదా థామస్ కి మంచి పేరుంది. స్టార్ హీరోయిన్ కి కాస్త దూరంలో ఉన్న నివేదా 2021 ఖచ్చితంగా ఆ స్టేటస్ అందుకుంటుందని అంటున్నారు. ఇటీవలే నాని, సుధీర్ బాబు నటించిన వి సినిమాలో సుధీర్ బాబు కి జంటగా నటించి ఆకట్టుకుంది. ఇక ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న వకీల్ సాబ్ సినిమాలో కీలక పాత్ర పోషిస్తుంది. బాలీవుడ్ లో అమితాబ్ తర్వాత తాప్సీ కి ఎంతటి పేరొచ్చిందో అందరికీ తెలిసిందే.
ఇప్పుడు నివేదా థామస్ హిందీలో తాప్సీ పోషించిన పాత్రనే వకీల్ సాబ్ లో పోషిస్తుందని తెలిసిందే. కాగా ఈ సినిమాలో పవర్ స్టార్ తర్వాత నివేదా ఆ రేంజ్ పాపులారిటీని సాధించడం పక్కా అన్న టాక్ ఉంది. తన పర్ఫార్మెన్స్ తో ఇప్పటికే యూనిట్ మొత్తాన్ని ఆకట్టుకుందని అంటున్నారు. కాగా నివేదా థామస్ కి ఇప్పుడు మరో అద్భుతమైన అవకాశం వచ్చిందని తాజా సమాచారం.
ప్రముఖ దర్శకుడు తేజ యాక్షన్ హీరో గోపీచంద్ తో అలిమేలు మంగ వెంకటరమణ అన్న సినిమా చేసేందుకు రెడీ అవుతున్నారు. కాగా ఈ సినిమాలో అలిమేలు మంగ గా నటించే హీరోయిన్ కోసం కొన్నాళ్ళుగా ప్రయత్నాలు జరుగుతున్నప్పటికి ఎవరు ఫైనల్ కాలేదు. అనుష్క , కాజల్ అగర్వాల్, కీర్తి సురేష్ పేర్లు ప్రచారంలోకి వచ్చినప్పటికి ఎవరు నటించబోతున్నారన్నది క్లారిటీ లేదు.
కాగా ఇప్పుడు ఈ పాత్ర కోసం నివేదా థామస్ ని ఎంచుకున్నారన్న వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఇదే గనక నిజమైతే ఖచ్చితంగా గోపీచంద్ కి హిట్ దక్కినట్టే అని చెప్పుక్కుంటున్నారు. తేజ – గోపీచంద్ – నివేదా థామస్ కాంబినేషన్ అంటే అందరికీ మంచి క్రేజ్ ఉంటుంది. చూడాలి మరి ఈ న్యూస్ అఫీషియల్ గా ఎప్పుడు బయటికి వస్తుందో.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!