నంద్యాలకు చెందిన ఓ ముస్లిం కుటుంబం అకారణంగా బలవన్మరణానికి పాల్పడిన ఘటన సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. అదే సమయంలో ఈ ఘటన రాజకీయ రంగు సైతం పులుముకుంది. ప్రధానంగా అధికార వైసీపీని ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ టార్గెట్ చేస్తోంది. అయితే , దీనిపై తాజాగా వైసీపీ కౌంటర్ ఇస్తోంది.
చంద్రబాబు హయాంలో
గుంటూరులో నిర్వహించిన నారా- హమారా మీటింగ్ సమయంలోని ఘటనలను పలువురు ఉదహరిస్తున్నారు. ఈ ఘటనలో యాధృచ్ఛికంగా నంద్యాలకు చెందిన ముస్లిం యువకులే, చంద్రబాబు ఇచ్చిన హామీలను నెరవేర్చాలంటూ ప్ల కార్డులు పట్టుకుంటే.. అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు సమక్షంలోనే, పోలీసులు వాళ్లను హింసించారని పలువురు గుర్తు చేస్తున్నారు. అలానే, ఓ ముస్లిం బాలికకు జరిగిన అన్యాయాన్ని ప్రశ్నిస్తూ.. న్యాయం కోసం పోలీస్ స్టేషన్ దగ్గర ఆందోళన చేస్తే ముస్లిం యువకులపై దేశ ద్రోహం కేసు పెట్టారని పలువురు ప్రస్తావిస్తున్నారు.
ఐదేళ్లలో ఏం జరిగిందంటే..
చంద్రబాబు అధికారంలో ఉన్న 5 ఏళ్ళలో నాలుగున్నరేళ్ళు ముస్లింలకు మంత్రి పదవి ఇవ్వాలని ఎందుకు అనిపించలేదని పలువురు ప్రశ్నిస్తున్నారు. పెట్టుబడిదారులైన నారాయణను దొడ్డిదారిన ఎమ్మెల్సీని చేసి మంత్రి పదవి ఇచ్చారు. అలానే తన థ కొడుకుని ఎమ్మెల్సీని చేసి మంత్రి పదవి ఇచ్చారు. కనీసం ముస్లింలకు ఎమ్మెల్సీ అయినా ఇచ్చారా. అంటూ ప్రశ్నిస్తున్నారు.
వైసీపీ ఫైర్
తాజాగా మంత్రి, పార్టీ ముఖ్య నేత కొలుసు పార్థసారథి మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు అధికారంలోకి వచ్చిన మొట్టమొదట నెల నుంచే ప్రజలపైనా, అధికారులపైనా దాడులు జరిగాయని ఆరోపించారు. చంద్రబాబు 5 ఏళ్ళ పాలనలో ఎప్పుడూ ముస్లింల సంక్షేమ కోసం పాటుపడింది లేదు. ఈరోజు లేనిప్రేమను ముస్లిం, మైనార్టీల మీద ఒలకబోస్తున్నాడు. అధికారంలో లేనప్పుడేమో, టీడీపీ పుట్టిందే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ల కోసం అని ప్రచారం చేసుకుంటాడు. అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను సర్వ నాశనం చేయడమే లక్ష్యంగా పనిచేస్తాడు. ఇదీ చంద్రబాబు రెండు కళ్ళు, రెండు నాల్కల ధోరణి. “ అని మండిపడ్డారు.
ఆనాడు జరిగింది ఇదే కదా బాబు ?
“అమరావతిలో ఒక వీఆర్వోని టీడీపీ నేతలు బట్టలు విప్పి కొట్టారు. పెందుర్తిలో ఒక దళిత మహిళను వివస్త్రను చేసి మీ పార్టీకి చెందిన వారే కొట్టడం జరిగింది. అలానే ఒక ఐపీఎస్ అధికారిని మీ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు దాడి చేస్తే… మీరు కూర్చోబెట్టి రాజీ చేశారే.. దానిని రాక్షస పాలన అంటారు. ఇసుక మాఫియాను అడ్డుకున్నందుకు ఒక మహిళా ఎమార్వోను మీ పార్టీకి చెందిన ఎమ్మెల్యే జుట్టుపట్టుకుని కొట్టారో దాన్ని రాక్షస పాలన అంటారు. చంద్రబాబు పాలనలో టీడీపీ ఎమ్మెల్యేలు బరితెగించి దాడులకు పాల్పడినట్టు, నేరాలు, ఘోరాలను ప్రోత్సహించినట్టుగా.. ఇప్పుడు వైయస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు ఎవరూ కూడా అలా చేయడం లేదు. మా నాయకుడు జగన్ మోహన్ రెడ్డి అడుగుజాడల్లో.. ప్రజా సేవా పరమావధిగా పని చేస్తున్నారు. సంక్షేమ పాలనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములవుతున్నారు. అదే మీ హయాంలో ఎమ్మెల్యేలను అవినీతిలో, అరాచకాల్లో భాగస్వాములను చేశారు. “ అంటూ వైసీపీ నేత విరుచుకుపడ్డారు.