భువనేశ్వర్: సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ విడుదల అవుతున్న వేళ ఒడిశా ముఖ్యమంత్రి, బిజూ జనతాదళ్ (బిజెడి) అధినేత నవీన్ పట్నాయక్ కీలక నిర్ణయం తీసుకున్నారు. రాబోయే లోక్సభ ఎన్నికల్లో తమ పార్టీ తరుపున 33శాతం మహిళలకు సీట్లు ఇస్తామని ప్రకటించారు.
కేంద్రపఢాలో ఆదివారం నిర్వహించిన మహిళా స్వయం సహాయక బృంద (ఎస్హెచ్జి) సమావేశంలో పాల్లొన్నారు.
జరగబోయే లోక్సభ ఎన్నికల్లో ఒరిస్సా నుండి పార్లమెంట్కి 33శాతం మంది మహిళలు వెళ్లనున్నట్లు తెలిపారు.
మహిళా సాధికారత అంటూ వ్యాఖ్యలు చేస్తున్న జాతీయ పార్టీలు కూడా తమ మాటను నిలబెట్టుకోవాలనీ, ఆ దిశగా అడుగులు వేయాలని నవీన్ పట్నాయక్ కోరారు.