NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

ఏపి ప్రభుత్వంపై సోము వీర్రాజు ఫైర్.! డీజీపీని తొలగించాలి..!!

రాష్ట్రంలో ఇటీవల జరిగిన ఆలయాలపై దాడులు, సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాల వెనుక టీడీపీ, బీజేపీ శ్రేణులు ఉన్నారంటూ ఏపి డీజీపీ గౌతమ్ సవాంగ్ వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. డీజీపీ చేసిన వ్యాఖ్యలపై ఏపి బీజెపీ అధ్యక్షుడు సోము వీర్రాజు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖలో ఆదివారం జరిగిన బీజెపీ కోర్ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. హింధూమనోభావాలను దెబ్బతీసే విధంగా డీజీపీ స్థాయిలో ఉన్న అధికారి మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. తక్షణం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గౌతమ్ సవాంగ్ ను ఆ పదవి నుండి తప్పించాలంటూ సోము వీర్రాజు డిమాండ్ చేశారు. ఆలయాలపై దాడులకు పాల్పడిన వారిని అరెస్టు చేయకుండా బేస్ లెస్ ఎలిగేషన్స్ తో బీజేపీ నేతలపై తప్పుడు కేసులు పెడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రామతీర్థం ఆలయ సందర్శనకు ఇతర పార్టీ నేతలకు అనుమతులు ఇచ్చి బీజెపీ నాయకులకు ఎందుకు అనుమతులు ఇవ్వలేదని ప్రశ్నించారు.

రాష్ట్ర ప్రభుత్వం హింధూ దేవాలయాల ఆస్తుల వివరాలను సేకరించినట్లుగానే చర్చిలు, మిషనరీ సంస్థలకు ఎన్ని కోట్ల ఆస్తులు ఉన్నాయో కూడా లెక్కలు తీయాలని డిమాండ్ చేశారు. మిషనరీ సంస్థలకు వేల కోట్ల రూపాయల ఆస్తులు ఉండగా ప్రభుత్వం నుండి చర్చిల నిర్మాణానికి నిధులు ఇవ్వడం ఏమిటని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం చర్చి ఫాదర్లకు జీతాలు జీతాలు ఎ ఉద్దేశంతో ఇస్తున్నారు, మత మార్పిడులు చేయడానికి ఇస్తున్నారా దీనిపై శ్వేత పత్రం విడుదల చేయాలని సోము వీర్రాజు డిమాండ్ చేశారు. క్రైస్తవమతంలో ఉన్న వారు కూడా రిజర్వేషన్ లు పొెందుతుండటం వల్ల అసలైన హింధూ దళితులకు అన్యాయం జరుగుతోందని దీనిపై సరైన లెక్కలు తేల్చాలన్నారు. మతం మార్చుకుని కూడా కొందరు రిజర్వేషన్ తో ఉన్నత పదవులు అనుభవిస్తున్నారని సోము వీర్రాజు అన్నారు. కొందరు పాస్టర్ లు సామాజిక సేవా కార్యక్రమాల పేరుతో నిధులు సేకరిస్తూ వాటిని పేద వర్గాలకు ఖర్చు చేయకుండా పాస్టర్లకు జీతాలు ఇస్తూ మత మార్పిడులను ప్రోత్సహిస్తున్నారని, ఆస్తులను కూడ బెట్టుకుంటున్నారని ఆరోపించారు.

రాష్ట్రంలో జరుగుతున్న ఈ వ్యవహారాలపై కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ఇతర పెద్దలకు నివేదక అందజేస్తామన్నారు. దళిత క్రిస్టియన్ అనేది రాజ్యాంగ విరుద్ధమని అన్నారు. ఎప్పుడో ధ్వంసమైన విగ్రహాలకు సంబంధించి ఇప్పుడు బీజెపీ శ్రేణులపై కేసులు పెడుతున్నారని సోము వీర్రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. విగ్రహాల ధ్వంసం కేసును ప్రభుత్వం సీరియస్ గా ఎందుకు తీసుకోవడం లేదని సోము వీర్రాజు ప్రశ్నించారు. తిత్లీ తుఫానులో విగ్రహం ధ్వంసమైందని సోషల్ మీడియాలో పెడితే కేసు పెట్టారని అన్నారు. బీజేపీ నాయకులు ధ్వంసం చేశారని నిరాధార ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. కేసును దారి మళ్లించేందుకు ప్రవీణ్ చక్రవర్తి వీడియో బయటపెట్టారని అన్నారు.

Related posts

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri

Venkatesh-Roja: వెంక‌టేష్ – రోజా మ‌ధ్య గొడ‌వేంటి.. ఈ ఇద్ద‌రి మ‌ధ్య చిచ్చు పెట్టిన హీరోయిన్ ఎవ‌రు?

kavya N

Ananya Agarwal: మ‌జిలీ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Ram Charan: ఫ‌స్ట్ టైమ్ చిరంజీవి కోసం పాట పాడిన రామ్ చ‌ర‌ణ్‌.. వింటే గూస్ బంప్స్ ఖాయం!

kavya N

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు మూవీలో అల్ల‌రి న‌రేష్ వ‌న్ మ్యాన్ షో.. కానీ అదే పెద్ద మైన‌స్!!

kavya N

Prasanna Vadanam: ప్రసన్నవదనం మూవీకి ఊహించ‌ని రెస్పాన్స్‌.. హీరోయిన్ తో లిప్ లాక్‌పై సుహాస్‌ వైఫ్ షాకింగ్ రియాక్ష‌న్‌!

kavya N

ఏపీ ఎన్నిక‌లు: కూట‌మి – వైసీపీ.. దొందూ దొందేనా ..!

తిరుగులేని పెద్దిరెడ్డికి బోడేను చూస్తే భ‌యం ఎందుకు స్టార్ట్ అయ్యింది ?

వైసీపీలో ఆ వార‌సుడికి ఇండిపెండెంట్ల ఎఫెక్ట్‌… !

శిష్యుడు రేవంత్‌ను ఫాలో అవుతున్న 40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ బాబోరు..?

సుక్క- ముక్క వేసుకుని కేసీఆర్ ప్రచారం.. ?

విశాఖ ఎంపీ: టీడీపీ క్యాండెట్‌ భ‌ర‌త్‌కు ఓట‌మి సీన్ అర్థ‌మైందా… !

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju