కాలాలతో సంబంధం లేకుండా జలుబు, దగ్గు వంటి సమస్యలు అన్ని సీజన్లలో వేధిస్తూనే ఉంటాయి . మార్కెట్లో మందులు ,సిరప్లు అందుబాటులో ఉన్న కూడా వాటి వల్ల సైడ్ ఎఫెక్ట్స్ తప్పవు. కాబట్టి ఇలాంటి వ్యాధులను నయం చేసేందుకు సహజ సిద్ధంగా లభించే పదార్థాలను వాడుకోవచ్చు దీనినే కషాయం అని కూడా అంటారు. దీని తీసుకోవడం వలన దగ్గు ,జలుబు నుండి వెంటనే ఉపశమనం పొందవచ్చు ఇది రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుంది.
ఉబ్బసం, ఊపిరితిత్తుల సమస్యలు,జ్వరం, గుండె జబ్బులు,ఒత్తిడి నుంచి ఉపశమనం పొందటానికి ఉపయోగ పడుతుంది. ఇది అన్ని రకాల వైరల్, బ్యాక్టీరియా, ఫంగల్ ఇన్ఫెక్షన్ల నుండి శరీరాన్ని చాలా సమర్థవంతం గా కాపాడుతుంది.
దీనిని మనం తేలికగా ఎలా తయారు చేసుకోవచ్చో తెలుసుకుందాం.
గుప్పెడు తులసి ఆకులు
2 కప్పులు – నీరు
ఒక టీ స్పూన్ – తాటి బెల్లం
అర టీ స్పూన్ – శొంఠి పొడి
అర టీ స్పూన్ – నల్ల మిరియాలు పొడి
ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం !!
- ఒక పాత్ర తీసుకుని అందులో కొలతగా తీసుకున్న నీరు పో సి, తులసి ఆకులను కొద్దిగా నలిపినట్టుగా చేసి వేయాలి.
- నీటి రంగు కొంచెం మారిన తర్వాత, తాటి బెల్లం వేసి కొంచెం సేపు మరగనిచ్చిన తర్వాత శొంఠిపొడి,నల్ల మిరియాలు పొడి, వేసి మరికొన్ని నిమిషాల పాటు మరిగించి గ్లాస్ లో కి వడకట్టి తీసుకోవాలి.
- అలా తీసుకున్న తులసి కషాయాన్ని వేడి,వేడి గా తాగాలి, అలా తీసుకోవడం వలన దగ్గు ,జలుబు నుంచి త్వరగా ఉపశమనం కలుగుతుంది.
- రోజుకు రెండు లేదా మూడు తాగితే మంచి ఫలితం ఉంటుంది. కాబట్టి కాషాయమ అని దూరం జరగకుండా ప్రయత్నించి చూడండి.