తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ నగరంలో మాత్రమే ఇప్పటిదాకా విమానాశ్రయాలు ఉండటం జరిగింది. ఇక ఏపీలో చూస్తే గన్నవరం తో పాటు విశాఖ, తిరుపతి నగరాలలో విమానాశ్రయాలు ఉన్నాయి. ఇటువంటి తరుణంలో తెలంగాణలో హైదరాబాద్ లో మాత్రమే కాక ఇతర నగరాలలో కూడా నిర్మించాలనే ఆలోచన లో టిఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.
ఈ మేరకు సీఎం కేసీఆర్ కేంద్రవిమానయాన శాఖకు రిపోర్టు ఇటీవల పంపించడం జరిగింది. అయితే తాజాగా కేంద్రం ఎయిర్ పోర్టు ఆథారిటీ ఆఫ్ ఇండియా ఓ రిపోర్టు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి పంపించింది. అందులో రాష్ట్రంలో కొత్త ఆరు విమానాశ్రయాలు ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది.
ఇందులో మూడు గ్రీన్ ఫీల్డ్ మూడు బ్రౌన్ ఫీల్డ్ విమానాశ్రయాలు రాబోతున్నాయట. దీంతో రాష్ట్రంలో ఆదిలాబాద్ మమ్మూర్ పెద్దపల్లి బసంత్ నగర్ జక్రాన్ పల్లి గుడిబండ కొత్తగూడెంలో లో కొత్త విమానాశ్రయాలను నిర్మించాలని కేసీఆర్ సర్కార్ ఆలోచన చేస్తున్నట్లు సమాచారం.