Pushpa : పుష్ప సినిమా గురించే ప్రస్తుతం టాలీవుడ్ లో పలువురు ఆసక్తికరంగా చర్చించుకుంటున్నారు. టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సుకుమార్ ఎంతో ప్రతిష్టాత్మకంగా పుష్ప తెరకెక్కిస్తున్న సంగతి తెల్సిందే. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఈ సినిమాతో పాన్ ఇండియా హీరోగా మారనున్నాడు. రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా తెలుగుతో పాటు హిందీ.. తమిళం.. మలయాళం.. కన్నడ భాషల్లో రిలీజ్ కాబోతోంది. ఈ సినిమాతోనే సుకుమార్ – అల్లు అర్జున్ బాలీవుడ్ లో కూడా తమ మార్కెట్ ని ఏర్పరచుకోవాలని తాపత్రయపడుతున్నారు.
కాగా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న పుష్ప సినిమా గురించి రోజుకో వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. అదే న్యూస్ ప్రేక్షకుల్లో ఇండస్ట్రీ వర్గాలలో హాట్ టాపిక్ గాను మారుతోంది. రీసెంట్ గా పుష్ప సినిమా రిలీజ్ డేట్ ని అనౌన్స్ భారీ సర్ప్రైజ్ ఇచ్చాడు. రిలీజ్ డేట్ అనౌన్స్ చేసినప్పటి నుంచి భారీగా సినిమా మీద అంచనాలు పెరిగాయి. ఇక భారీ సీక్వెన్స్ షూట్ చేస్తున్నారు. అడవుల్లో ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతుండగా అల్లు అర్జున్ లారీడ్రైవర్ గా కనిపించనున్నాడు. కాగా సుకుమార్ – అల్లు అర్జున్ కాంబినేషన్ లో వస్తున్న హ్యాట్రిక్ సినిమా కావడం కూడా విశేషం.
Pushpa : ఆ టాప్ సీక్రెట్ ఏంటో తెలియాలంటే పుష్ప రిలీజయ్యాకే తెలుస్తుంది.
అయితే రీసెంట్ గా ఈ సినిమాకి సంగీతం అందిస్తున్న రాక్ స్టార్ దేవీశ్రీప్రసాద్ ఒక విషయాన్ని బయట పెట్టాడు. పుష్పలో ఓ భారీ సన్నివేశం గురించి ఇండస్ట్రీ వర్గాలలో హాట్ హాట్ గా చర్చలు సాగుతున్నాయి. ఆ సీన్ ఏంటో తెలుసుకోవాలనే అభిమానులు తెగ ఆరాట పడుతున్నారు. ఈ లోపే మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాలో ఐదు వందల మందితో ఓ సీక్వెన్స్ కొండపైన షూట్ చేసినట్లు చెప్పుకొచ్చాడు. దాంతో సీక్వెన్స్ ఏంటి.. ఫైటా లేకపోతే చేసింగ్ సీనా అంటూ తెగ చర్చలు సాగుతున్నాయి. ఆ టాప్ సీక్రెట్ ఏంటో తెలియాలంటే పుష్ప రిలీజయ్యాకే తెలుస్తుంది.
Aavesham OTT: డిజిటల్ స్ట్రీమింగ్ డేట్ ను కన్ఫామ్ చేసుకున్న ఆవేశం మూవీ.. ఈ రూ. 150 కోట్ల మూవీ స్ట్రీమింగ్ ఎక్కడంటే..!