Death: సాధారణంగా ఎప్పుడైనా మరణం సంభవించిన ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ నుంచి తిరిగి వచ్చాక మన పెద్దలు చెప్పే మొదటి మాట ఏమిటంటే స్నానం చేసి ఇంట్లోకి రావాలి అని. వారు అలా చెప్పడానికి కారణం లేకపోలేదు. మన పెద్దలు చెప్పిన ప్రతి మాటలోనూ ఏదొక అంతరార్ధం ఉంటుంది. ఈనాటి సైన్స్ పరంగా కూడా వైద్యులు పెద్దల మాటలను నిజమని నిరూపిస్తున్నారు. అంటే ఆ రోజులలోనే ఇన్ని అలోచించి మనకి చాలా ఆచారాలను పెట్టారన్నమాట. అందులోని కారణం మనకి తెలిసినా తెలియకపోయినా ఆచరించడం వలన మనకి మంచే తప్ప చెడు జరగదని అర్ధంఅవుతుంది.
అంత్యక్రియలకు వెళ్లివచ్చిన వారు లేదా స్మశానం నుంచి తిరిగి వచ్చిన వారు తమ శరీరంపై ఉన్న దుస్తులను అలానే ఉంచుకుని స్నానం చెయ్యాలి అని సంప్రదాయం ఉంది. లేకుంటే మరణించిన వారి ఆత్మ వీరిని వెంటాడుతుంది అని చెప్పి భయపెట్టేవారు. అయితే ఆత్మ వెంటాడడం అనేది మూఢనమ్మకమే కావొచ్చు కానీ ఈ విశ్వాసం వెనుక ఓ రహస్యం దాగి ఉంది.
అదేమిటంటే ఓ వ్యక్తి మరణించిన తరువాత అతడి శరీరం నుండి అనేక రకాల విషక్రిములు బయటకు వస్తాయి. ఇవి ఆ దేహం చుట్టూ ఉంటాయి. ఎవరయితే ఆ శవాన్ని తాకుతారో వారిపై ఈ క్రిములు వ్యాప్తిచెందుతాయి. అందుకనే ఈ విషక్రిముల నుంచి బయట పడడానికి పరిష్కారంగా ఉన్న బట్టల మీదే స్నానం చేసి ఇంట్లోకి వెళ్ళాలి అని చెప్తారు. లేకపోతే ఈ క్రిములు రోగాలకు కారణం అవుతాయి. తలపై నుంచి చల్లటి నీళ్లతో స్నానం చెయ్యడం వలన మన మెదడు నుంచి ఉత్పన్నమయ్యే శక్తీ తరంగాలు శరీరం క్రిందుగా పూర్తి శరీరాన్ని వ్యాపించి ఆ విషక్రిములను హరిస్తాయి. తద్వారా ఎటువంటి రోగాలు దరిచేరవు.
ఈ న్యూస్ ని మీ వాట్సాప్ మరియు ఫేస్ బుక్ లో ఉన్న ఫ్రండ్స్ అందరితో షేర్ చెయ్యండి. కిందనే ఉన్న షేర్ బటన్ ఉపయోగించి వెంటనే వారికి షేర్ చెయ్యండి.