Big Breaking : రాష్ట్రంలో పరిషత్ ఎన్నికల నగారా మోగింది. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నోటిఫికేషన్ ను ఎస్ఈసీ నీలం సాహ్ని విడుదల చేశారు. ఈ నెల 8వ తేదీన పోలింగ్ నిర్వహిస్తారు. 9వ తేదీ అవసరమైన చోట రీపోలింగ్ నిర్వహిస్తారు. 10వ తేదీ ఓట్ల లెక్కింపు నిర్వహించి ఫలితాలు విడుదల చేస్తారు. నోటిఫికేషన్ విడుదలకు ముందు ఎస్ఈసీ నీలం సాహ్ని కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. జిల్లాల్లో కరోనా పరిస్థితులను, వ్యాక్సినేషన్ తదితర విషయాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అదిత్యనాథ్ దాస్, డీజీపీ గౌతమ్ సవాంగ్ తదితర ఉన్నత స్థాయి అధికారులు పాల్గొన్నారు.
నీలం సాహ్ని రాష్ట్రంలో తొలి మహిళా ఎస్ఈసీ కావడం విశేషం కాగా, ఎస్ఈసీగా బాధ్యతలు చేపట్టిన తొలి రోజే ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల చేయడం మరో విశేషం.
మరో పక్క జడ్పిటీసీ, ఎంపీటీసి ఎన్నికలను ప్రధాన ప్రతిపక్షం టీడీపీ బహిష్కరించాలని నిర్ణయించాలని నిర్ణయం తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. గత నెలలో జరిగిన పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ క్లీన్ స్పీప్ చేసిన సంగతి తెలిసిందే.