Telangana:దేశవ్యాప్తంగా కరోనా కలకలం కొనసాగుతోంది. కొన్ని రాష్ట్రాల్లో భారీ సంఖ్యలో కేసులు నమోదు అవుతున్నాయి. ఈ సమయంలోనే మళ్లీ లాక్ డౌన్ తెరమీదకు వచ్చింది. ఈ నేపథ్యంలో తమ రాష్ట్రంలో కోవిడ్ -19 యొక్క భయంకరమైన వ్యాప్తిని అరికట్టడానికి మహారాష్ట్ర ప్రభుత్వం ఆదివారం కఠినమైన కొత్త ఆంక్షలను ప్రకటించింది. ప్రతి శుక్రవారం సాయంత్రం నుంచి సోమవారం ఉదయం వరకు వారాంతపు లాక్ డౌన్ అలానే ప్రతి రాత్రి కర్ఫ్యూ విధించనున్నారు. ఇదే సమయంలో పొరుగు రాష్ట్రమైన తెలంగాణ అలర్ట్ అయింది.
మహారాష్ట్రలో ఇది సీన్…
దాదాపు గత రెండు వారాల నుండి రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ఒక్కప్పుడు పదుల సంఖ్యలోకి వచ్చిన రోజువారీ కరోనా కేసులు ఇప్పుడు వెయ్యికి పైగా వస్తున్నాయి. దాంతో మళ్ళీ అందరూ తప్పకుండా కరోనా నియమాలు పాటించాలని.. అలాగే వ్యాక్సిన్ తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. మహారాష్ట్రలో కరోనా కేసుల పెరుగుదలను పరిమితం చేయడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలనే అంశం మీద చర్చించడానికి మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే ఆదివారం రాష్ట్రానికి చెందిన బిజినెస్ మ్యాన్ బృందాన్ని కలిశారు. సీఎం మరియు పారిశ్రామికవేత్తల మధ్య మధ్యాహ్నం జరిగిన వర్చువల్ సమావేశానికి పరిశ్రమ లాబీ సిఐఐ జాతీయ అధ్యక్షుడు, బ్యాంకర్ ఉదయ్ కోటక్ నాయకత్వం వహించినట్లు అధికారులు తెలిపారు. మహారాష్ట్రలో మళ్లీ లాక్ డౌన్ విధించినట్లయితే ప్రజలకు కష్టాలు ఎదురవుతాయని పరిశ్రమల నాయకులు హెచ్చరించారు. ఈ నేపథ్యంలో గత కొన్ని వారాలుగా రాష్ట్రంలో కోవిడ్ -19 కేసులు బాగా పెరిగిన నేపథ్యంలో ఈ ఉత్తర్వు వచ్చింది.
పొరుగు రాష్ట్రంలో..
మరోవైపు తెలంగాణ లో కరోనా వ్యాప్తి కట్టడికి తీసుకుంటున్న చర్యలపై రాష్ట్ర గవర్నర్ తమిళి సై ఆరా తీశారు. రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటలకు ఫోన్ చేసి వివరాలు అడిగి తెలుసుకున్నారు గవర్నర్. ప్రజలు కనీస జాగ్రత్తలు తీసుకోవాలని సూచించిన తమిళి సై… తెలంగాణ వైద్యారోగ్య శాఖ రూపొందించిన కొత్త యాప్ గురించి మంత్రి ని అడిగి తెలుసుకున్నారు.