Mahesh Babu: నేడు సూపర్ స్టార్ కృష్ణ పుట్టిన రోజు కావడంతో సోషల్ మీడియా లో మహేష్ అభిమానులు కృష్ణ ఫోటోలతో రచ్చ చేస్తున్నారు. ప్రతి ఏడాది తండ్రి కృష్ణ పుట్టినరోజు నాడు మహేష్ బాబు తాను షూటింగ్ చేస్తున్న సినిమాకి సంబంధించిన స్టిల్స్ లేదా వీడియో రిలీజ్ చేసి.. అభిమానులను అలరించే వారు. అయితే ప్రస్తుతం దేశంలో కరోనా సెకండ్ వేవ్ కారణంగా.. చాలామంది కరోనా బారిన పడటంతో.. ప్రాణాలు కోల్పోవడంతో..విషాదఛాయలు అలముకోవటంతో.. మహేష్ బాబు చేస్తున్న ప్రాజెక్టులకు సంబంధించి ఫోటోలు కానీ వీడియోలు కానీ రిలీజ్ అయ్యే పరిస్థితి లేదని మహేష్ బాబు అభిమానుల టీం క్లారిటీ ఇవ్వడం జరిగింది.
ఇదిలా ఉంటే తాజాగా ఓ ప్రముఖ టీవీ ఛానల్ కి కృష్ణ ఇచ్చిన ఇంటర్వ్యూలో మహేష్ బాబు బాలీవుడ్ ఎంట్రీ గురించి సరికొత్త వార్త తెలియజేశారు. విషయంలోకి వెళితే అప్పట్లో టాలీవుడ్ ఇండస్ట్రీలో స్వర్గీయ నందమూరి తారక రామారావు నటించిన పాతాళభైరవి.. అనేక సంచలనాలు సృష్టించిన సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ కెరీర్లో అతి పెద్ద భారీ హిట్ సినిమాలలో ఇది ఒకటి. అయితే ఈ సినిమాని బాలీవుడ్ ఇండస్ట్రీలో మహేష్ బాబుతో చేయాలని కృష్ణ ప్లాన్ చేయడం జరిగిందట. అయితే కృష్ణ ఇచ్చిన ఆఫర్ ని మహేష్ సున్నితంగా అప్పుడు తిరస్కరించడం జరిగిందట.
Read More: Mahesh Babu: ఆతృతగా ఉన్న అభిమానులను నిరాశపరిచిన మహేష్ బాబు??
ఈ విషయాన్ని తాజాగా తెలియజేసి అప్పట్లోనే బాలీవుడ్ ఇండస్ట్రీ లోకి వెళ్లాలని ఉద్దేశం తనకు లేదని సున్నితంగా.. మహేష్ బాబు చెప్పినట్లు కృష్ణ ఇటీవల తెలియజేశారు. ఈ వార్త సోషల్ మీడియాలో రావడంతో.. అయితే ఇండస్ట్రీలో ప్రస్తుతం ఉన్న హీరోల అందరి కంటే ముందుగానే మహేష్బాబుకి బాలీవుడ్ ఆఫర్ వచ్చిందన్నమాట అంటూ ఆయన అభిమానులు .. తాజా వార్త పై రియాక్ట్ అవుతున్నారు. మహేష్ కూడా తనకి.. బాలీవుడ్ ఇండస్ట్రీ లోకి వెళ్లాలని ఉద్దేశం.. లేదనీ చాలా సందర్భాలలో తెలియజేయడం జరిగింది. తెలుగు లోనే తన కెరియర్ కొనసాగుతుందని అనేక ఇంటర్వ్యూలలో మహేష్ పేర్కొన్నారు.
Pavitra Jayaram: ప్లీజ్ అలా మాట్లాడకండి.. పవిత్ర జయరాం కూతురు ఎమోషనల్ కామెంట్స్..!