Corona: హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ కరోనా విషయంలో మరోమారు సంచలన వ్యాఖ్యలు చేశారు. 2021 చివరి నాటికి దేశంలోని అర్హులైన ప్రతి ఒక్కరికీ వ్యాక్సిన్ అందిస్తామని కేంద్రం చేస్తున్న ప్రకటనలను ఆయన తప్పుపట్టారు. 108 కోట్ల మంది ప్రజలకు డిసెంబర్ ఆఖరు కల్లా వ్యాక్సినేషన్ పూర్తి చేస్తామని కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ ప్రకటించడాన్ని ఓవైసీ దుయ్యబట్టారు. ఈ ఏడాది డిసెంబర్కల్లా 216 కోట్ల డోసులు ఎలా సాధ్యం? అని ఆయన ప్రశ్నించారు.
Read More: Eatela Rajendar: ఈటల రాజేందర్… కొంత క్లారిటీ …. ఎంతో కన్ఫ్యూజన్….
కేంద్రం ఏం చెప్తోంది?
దేశంలోని 130 కోట్ల మంది జనాభాలో మూడు శాతం కన్నా తక్కువ మంది రెండు డోసులు తీసుకున్నారని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కామెంట్ చేసిన సంగతి తెలిసిందే. దీనిపై కేంద్రం క్లారిటీ ఇచ్చింది. కేంద్ర సమాచార ప్రచార శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ మీడియాతో మాట్లాడుతూ, 2021 చివరి నాటికి దేశంలోని అర్హులైన ప్రతి ఒక్కరికీ వ్యాక్సిన్ అందిస్తామన్నారు . ఇప్పటి వరకు 20 కోట్లకు పైగా వ్యాక్సిన్ డోసులను అందించామని పేర్కొన్న కేంద్ర మంత్రి ప్రజలకు వ్యాక్సిన్ అందిస్తున్న వేగవంతమైన దేశాల్లో భారత్ రెండవదని తెలిపారు. 2021లోపే భారత్లో వ్యాక్సిన్ ప్రక్రియ పూర్తవుతుందని..దీనికి సంబంధించి ఆరోగ్య మంత్రిత్వ శాఖ బ్లూప్రింట్ ఇచ్చిందని కేంద్ర మంత్రి వివరించారు.
Read More : KCR: కేసీఆర్ , జగన్ … ఏపీ తెలంగాణ ప్రజల బాధలు పట్టించుకోండి!
ఓవైసీకి మండిపోయింది…
అయితే, డిసెంబర్ ఆఖరు కల్లా 108 కోట్ల మంది ప్రజలకు వ్యాక్సినేషన్ చేస్తామని కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ అనడం మీద ఓవైసీ మండిపడ్డారు. ప్రభుత్వం ప్రజల్ని మభ్యపెట్టడానికి ఇలాంటి ప్రకటనలు చేస్తోందన్నారు. “ఈ ఏడాది ఆగస్టు నుంచి డిసెంబర్ నెలల మధ్యలో 216 కోట్ల టీకా డోసులను తయారు చేస్తామని ప్రభుత్వం చెబుతోంది. ఈ వ్యాక్సిన్ల్లో 55 కోట్ల టీకాలు కోవ్యాక్సిన్వే. కానీ ప్రస్తుతం భారత్ బయోటెక్ రోజుకు 5 లక్షల టీకాలనే తయారు చేస్తోంది. టీకా ఉత్పత్తి వేగాన్ని పెంచి రోజుకు 37 లక్షల వ్యాక్సిన్ లను భారత్ బయోటెక్ తయారు చేయాలి. మనల్ని మభ్యపెట్టడానికే ప్రభుత్వం ఇలా చెబుతోంది.. తప్పితే మరొకటి కాదు’ అని ఓవైసీ ట్వీట్ చేశారు.