KCR : తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులైన కే చంద్రశేఖర్ రావు , వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గురించి సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఇద్దరు ముఖ్యమంత్రులు ముందుకు వచ్చిన కీలక అంశంలో నిర్ణయం తీసుకుంటే రెండు రాష్ట్రాల ప్రజలకు పెద్ద ఉపశమనం అని పలువురు పేర్కొంటున్నారు. ఆంధ్రప్రదేశ్-తెలంగాణా సరిహద్దుల్లో పరిస్థితుల గురించే ఇదంతా. తెలంగాణాలో లాక్డౌన్ ఆంక్షలు ఉండటం, పైగా ఉదయం 10 గంటల తర్వాత ఆంక్షలు మరింత కఠినతరం చేస్తుండటంతో రెండు రాష్ట్రాల సరిహద్దుల్లో మరోసారి ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో ఈ చర్చ జరుగుతోంది.
Read More : KCR: షాక్ః కేసీఆర్ చేసిన ప్రకటనే లైట్ తీసుకుంటున్న అధికారులు
మళ్లీ అదే సమస్య…
తెలంగాణ లో లాక్ డౌన్ అమల్లో ఉన్న నేపథ్యంలో ఏపీ నుంచి తెలంగాణలోకి వచ్చే వాహనాలకు సరిహద్దుల్లో ఈ-పాస్లు కలిగి ఉండటాన్ని పోలీసులు తప్పనిసరి చేశారు. లాక్డౌన్ సడలింపు సమయంలో సరిహద్దుల ద్వార వచ్చేవారికి ఈ-పాస్ ఉంటేనే తెలంగాణలోకి అనుమతిస్తున్నారు. తాజాగా పుల్లూరు టోల్ప్లాజా వద్ద ప్రైవేట్ వాహనాలను పోలీసులు నిలిపివేశారు. రాష్ట్రంలోకి ప్రవేశించేందుకు తగిన ఈ పాస్ ఉంటేనే వాహనాలకు అనుమతి అనుమతిస్తున్నారు. దీంతో టోల్ ప్లాజా వద్ద ట్రావెల్స్ బస్సులు, కార్లు అనేకం నిలిచిపోయిన పరిస్థితి నెలకొంది. అయితే, అంబులెన్సులు , అత్యవసర వాహనాలు, సరుకు వాహనాలకు పాస్లు లేకున్నా అనుమతిస్తున్నారు.
Read more : Lock down: గుడ్ న్యూస్ః పక్క రాష్ట్రంలో లాక్ డౌన్ ఎత్తేస్తున్నారు
సరిహద్దుల్లో సమస్యలు లేకుండా…
తెలంగాణ లోకి ఎంట్రీ విషయంలో ఈ-పాస్ తప్పనిసరి చేయటంతో ప్రయాణికులు, వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారని సోషల్ మీడియాలో పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. గతంలో ఉదయం 6 నుండి 10 గంటల వరకు తెలంగాణాలోకి ప్రవేశం కల్పించినట్లే ప్రస్తుతం సైతం అనుమతించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని పలువురు కోరుతున్నారు. ఈ నేపథ్యంలో ఇరు రాష్ట్రాల సీఎంలు ఉదారంగా స్పందించాలంటున్నారు.