Eatela Rajendar: టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత ఈటల రాజేందర్ పొలిటికల్ కెరీర్ పై ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఆయన బీజేపీలో చేరుతారా? లేదా స్వతంత్ర అభ్యర్థిగా ఉంటారా? ఒకవేళ అలా ఉంటే ఎమ్మెల్యేగా కొనసాగుతారా? అనే విషయంపై వివిధ రకాల చర్చలు సాగుతున్నాయి. తాజాగా జరుగుతున్న ఎపిసోడ్లో ఈటల ఉదంతం ఏ మలుపులు తిరుగుతుందా? అనే టాక్ తెరమీదకు వస్తోంది.
Read More : KCR: గ్రాప్ పెంచుకున్న కేసీఆర్…గాలి తీసేస్తున్నది ఎవరంటే….
ఈటల చేరడం ఖాయమేనా?
మాజీ మంత్రి ఈటల రాజేందర్ బీజేపీలో చేరిక దాదాపు ఖరారు అయిందని గత కొద్దిరోజులుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్తో పాటు పలువురు ముఖ్య నేతలు ఈటల రాజేందర్ తో చర్చలు జరుపుతున్నారని, త్వరలోనే ఆయన చేరిక ఖాయమని టాక్ వచ్చింది. ఆయనతో పాటుగా బీజేపీలోకి మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్రెడ్డి, మాజీ జెడ్పీ ఛైర్మన్ తులా ఉమా, మరికొందరు టీఆర్ఎస్ నేతలు చేరనున్నట్లు సైతం టాక్ వినిపించింది. అయితే, ఈ ప్రచారం మళ్లీ మలుపులు తిరిగింది.
Read More : Corona: కరోనా కలకలం.. కేసీఆర్ కు ఓ బ్యాడ్ న్యూస్
అప్పుడే లుకలుకలు.. అంతలోనే క్లారిటీలు….
అయితే, ఈటల రాజేందర్ బీజేపీలో చేరడంపై అప్పుడే లుకలుకలు మొదలయ్యాయి. హుజురాబాద్ నియోజకవర్గానికి చెందిన నేత అయిన తనను సంప్రదించకుండా ఈటల రాజేందర్ బీజేపీ లో చేరడం గురించి ఎలా చర్చలు జరుపుతారని మాజీ మంత్రి, ఇటీవలే బీజేపీలో చేరచిన పెద్దిరెడ్డి ప్రశ్నించారు. ఢిల్లీ నుండి స్పెషల్ ఫ్లయిట్ లో వచ్చిన నాయకులకు నాకు చెప్పడానికి ఏంటి బాధ ? అంటూ రుసరుసలాడారు. హైదరాబాద్ లోని ఫామ్ హౌస్ లో చర్చలు జరిపితే కూడా నేను గుర్తు రాలేదా? అని కామెంట్లు చేశారు. మరోవైపు ఈటల రాజేందర్ తన పొలిటికల్ కెరీర్ గురించి ప్రచారాలు నమ్మవద్దని తానే క్లారిటీ ఇస్తానని చెప్పారు. దీంతో అసలేం జరుగుతోందనే టాక్ వినిపిస్తోంది.