Smart Mask: కరోనా వైరస్ సెకండ్ వేవ్ విజృంభిస్తున్న నేపథ్యంలో చిన్న పిల్లలు మొదలు కొని పెద్దల వరకూ ప్రతి ఒక్కరూ మాస్కులు ధరిస్తున్నారు. తొలుత మాస్కుల ధరించడానికి ఇష్టపడని వారు సైతం ఇప్పుడు కరోనా భయంతో మాస్కులు ధరిస్తున్నారు. దానికి తోడు మాస్కులు ధరించకుండా రోడ్లపైకి వెళితే అధికారులు జరిమానాలు కూడా విధిస్తుండటంతో మాస్కులు శరీరంగా ఇప్పుడు భాగమయ్యాయి.
మాస్క్ ల వినియోగం బాగా పెరగడంతో మార్కెట్ లోకి రకరకాల మాస్కులు అందుబాటులోకి వస్తున్నాయి. ఎన్ 95 మాస్కులు, క్లాత్ మాస్కులు, ఒన్ టైమ్ యూజ్ మాస్కులు ఇలా అనేక రకాలు మార్కెట్ లో లభిస్తున్నాయి. అదే విధంగా స్తోమత కల్గినవారి కోసం ఖరీదైన మాస్కులు కూడా ఆన్ లైన్ లో లభిస్తున్నాయి. గతంలో ఒక మాస్కు చాలని చెప్పిన వైద్యులు ఇప్పుడు రెండు మాస్కులు (డబుల్ మాస్క్)లు ధరించాలని కూడా సూచిస్తున్నారు. గాలి ద్వారా కూడా కరోనా వైరస్ వ్యాపిస్తుందని ఇటీవల నిపుణులు హెచ్చరిస్తుండటంతో గాలిని శుద్ధి చేసే మాస్క్ల కోసం ప్రజలు చూస్తున్నారు.
Read More: Video Viral: ఏసీబీ అధికారినంటూ పోలీసులనే బురిడీ కొట్టించే ప్రయత్నం చేసి..!!
ఈ నేపథ్యంలో కరోనాతో పాటు ఇతర వైరస్ లను నిర్మూలించడం, బయటి గాలిని శుద్ధి చేసే అందించే ఖరీదైన మాస్కులు అందుబాటులోకి వచ్చాయి. కాజీపేటకు చెందిన ఓ వ్యాపారి ఆకుల నర్శింహారావు ఇటీవల ఆన్ లైన్ ఓ మాస్క్ తెప్పించుకున్నాడు. అతను తొలిదశ వేవ్ లోనే కరోనా బారిన పడి కోలుకున్నాడు. ఇప్పుడు చాలా జాగ్రత్తగా ఉండేందుకు రూ.12వేలతో ఓ ప్రత్యేకమైన మాస్క్ ను ఆన్ లైన్ ద్వారా కొనుగోలు చేశాడు. ఆ మాస్క్ పెట్టుకోకుండా అతను బయటకు కూడా రావడం లేదు. ఈ మాస్క్ ప్రత్యేకత ఏమిటంటే కరోనా వైరస్ తోపాటు ఇతర వైరస్ లను నిర్మూలించడంతో పాటు బయటి గాలిని శుద్ధి చేసి అందిస్తుందట.
అదే విధంగా త్వరలో మన ముందుకు స్మార్ట్ మాస్క్లు కూడా రాబోతున్నాయి. వీటి ప్రత్యేకత ఏమిటంటే వైరస్ ను నిరోధించడంతో పాటు ఎంత సేపు మాస్క్ పెట్టుకున్నాం, ఎంత గాలి పీల్చుకున్నాం, క్వాలిటీ గాలి పీల్చుకుంటున్నామా లేదా అనే విషయాలను తెలియజేస్తుంది. గాలిని ఫిల్టర్ చేయడం ఈ మాస్క్ ప్రత్యేకత. ఇది ఎలక్ట్రానిక్ మాస్క్. ఇది యాప్ తో అనుసంధానమై పని చేస్తుంది. ఎయిర్ పాప్ అనే సంస్థ స్మార్ట్ మాస్క్ లను తయారు చేస్తోందట. ఇవి త్వరలో మార్కెట్ లోకి రానున్నాయి.