Modi: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తనదైన శైలిలో గత రెండు రోజులుగా సంచలన వార్తలు వెలువరిస్తున్న సంగతి తెలిసిందే. ఓ వైపు పలు రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం కొత్త గవర్నర్లను నియమించింది. మరోవైపు తాజాగా నూతన మంత్రుల నియామకం పూర్తి చేసింది. పాత మంత్రివర్గ సహచరుల్లో కొందరికి పదవి ఊస్ట్ అయింది. నరేంద్ర మోడీ చేసిన ఈ కసరత్తు వెనుక లెక్కలు వేరే ఉన్నాయని పలువురు అంచనా వేస్తున్నారు.
Read More: Modi: మోడీ తీసుకున్న సంచలన నిర్ణయంతో మనకు ఏం లాభమంటే…
అంతా ఎన్నికల మయం..
2019 సార్వత్రిక ఎన్నికల సమయంలో జ్యోతిరాదిత్య సింధియా కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరారు. దీంతో మధ్యప్రదేశ్లో బీజేపీ ప్రభుత్వ ఏర్పాటుకు మార్గం సుగమమైంది. మధ్యప్రదేశ్ లో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు సహకరించినందుకు సింధియాకు కేంద్ర పదవి దక్కుతోంది. అస్సాం సీఎం రేను నుంచి తప్పుకున్న మాజీ ముఖ్యమంత్రి శర్వానంద సోనోవాల్ కూడా కేంద్ర మంత్రివర్గంలో చోటు సంపాదించారు. మొత్తంగా గడిచిన ఎన్నికలను పరిగణనలోకి తీసుకొని ప్రధాని మంత్రి పదవులు కల్పిస్తున్నారు.
Read More: Modi: మోడీ బ్యాడ్ టైం కాకపోతే.. ఇలా నవ్వుల పాలు అవడం ఏంటి!
ఉత్తరప్రదేశ్ విషయంలో లెక్కలు..
వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఉత్తరప్రదేశ్ నుంచి ఎక్కువ మందికి అవకాశం దక్కుతోంది. దీంతోపాటుగా విధేయతకు, సీనియార్టీకి సైతం ప్రధాని చాన్స్ ఇచ్చారు. కేంద్ర మంత్రివర్గంలో ఉన్న తవార్చంద్ గెహ్లాట్ను కర్ణాటక గవర్నర్ గా నియమించారు. హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ హర్యానాకు బదిలీ అయ్యారు. మిజోరాం గవర్నర్ మాజీ ఎంపీ హరిబాబుకు చాన్స్ ఇచ్చారు. తద్వారా ఏపీ, తెలంగాణ కూడా తమ ప్రాధాన్య రాష్ట్రాల్లో ఒకటనే సందేశాన్ని ప్రధాని పంపించారు.