Modi: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తన గేమ్ ప్లాన్ మార్చారా? ఇటీవలి కాంలో జరుగుతున్న పరిణామాల ఆధారంగా ఆయన కొత్త వ్యూహం అమలు చేస్తున్నారా? ఈ చర్చ ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. ప్రధానమంత్రి నరేంద్రమోడీతో ఢిల్లీలో తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ సమావేశమైన నేపథ్యంలో ఈ చర్చ జరుగుతోంది. స్టాలిన్ ఈ సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడుతూ భేటీ సంతృప్తికరంగా జరిగిందని చెప్పడం గమనార్హం.
Read More: Modi: మోడీ మంత్రి వర్గంలో మార్పులు… చాన్స్ కొట్టేసిన యువనేత ఎవరంటే..
ఢిల్లీలో ఏం జరిగిందంటే…
దేశ రాజధాని న్యూఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో స్టాలిన్ సమావేశం అయ్యారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రధాని మోడీతో సమావేశం చాలా సంతృప్తికరంగా ముగిసిందన్నారు. రాష్ట్రాభివృద్ధికి తమ సహకారం అందిస్తామని ప్రధాని మోడీ హామీ ఇచ్చారని స్టాలిన్ తెలిపారు. తమిళనాడులోని సమస్యల పరిష్కారం కోసం తనతో ఎప్పుడైనా సమావేశం అవడానికి, ఫోన్లో సంప్రదింపులు జరిపేందుకు సిద్ధమని ప్రధాని హామీ ఇచ్చారని స్టాలిన్ తెలిపారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలను కొన్నింటిని వెనక్కి తీసుకోవాల్సిందిగా ప్రధానికి విజ్ఞప్తి చేసినట్లు స్టాలిన్ వెల్లడించారు.
Read more:Modi: రైతు వ్యతిరేక చట్టాలు మోడీ ఎప్పుడు ఉపసంహరించుకుంటారంటే…
మోడీ గేమ్ ఇదే…
తమిళనాడులో రైతులు ఇటీవల కేంద్రం నూతనంగా తీసుకువచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకోవాలని ఆందోళన చేశారు. దీంతో పాటుగా నీట్, నూతన విద్యా విధానాలను రద్దు చేయాలని ఆందోళన చేస్తున్నారు. చెంగల్పట్టు వ్యాక్సిన్ కేంద్రంలో తిరిగి ఉత్పత్తి ప్రారంభించడం, సేతు సముద్రం ప్రాజెక్ట్ పునరుద్ధరణ వంటి అంశాలు రాష్ట్రంలో హాట్ టాపిక్ అయ్యాయి. ఈ నేపథ్యంలో ఆందోళనలు సద్దుమణిగేలా ప్రధాని మోడీ నేరుగా ఆ రాష్ట్ర సీఎంతో సమావేశం జరిపారని విశ్లేషకులుల అంటున్నారు.